Modi Government Warns Employees Of 'consequences' If They Go On Strike Today
నేడే భారత్ బంద్.. సమ్మెలో పాల్గొనవద్దంటూ ఉద్యోగులకు Modi సర్కార్ వార్నింగ్.. లేదంటే..
మోదీ గవర్నమెంట్ ఉద్యోగులకు షాకిచ్చింది. సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల పిలుపు మేరకు నేడు జరగనున్న భారత్ బంద్లో తమ ఉద్యోగులకు పాల్గొనవద్దని హెచ్చరించింది. దీనికి సంబంధించి ఆర్డర్లు కూడా జారీ చేసింది. ఒకవేళ ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించి సమ్మెలో పాల్గొంటే ఇబ్బందులు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.
Samayam Telugu8 Jan 2020, 6:14 am
మోదీ గవర్నమెంట్ ఉద్యోగులకు షాకిచ్చింది. సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల పిలుపు మేరకు నేడు జరగనున్న భారత్ బంద్లో తమ ఉద్యోగులకు పాల్గొనవద్దని హెచ్చరించింది. దీనికి సంబంధించి ఆర్డర్లు కూడా జారీ చేసింది. ఒకవేళ ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించి సమ్మెలో పాల్గొంటే ఇబ్బందులు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.
ట్రేడ్ యూనియన్లు + బ్యాంక్ యూనియన్లు
పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు జనవరి 8న దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ స్ట్రైక్ జరుగుతోంది. ట్రైడ్ యూనియన్లతో పాటు బ్యాంక్ యూనియన్లు కూడా ఈ భారత్ బంద్లో పాల్గొంటున్నాయి. ఐదు కీలక బ్యాంక్ యూనియన్లు ఈ సమ్మెలో పాలుపంచుకోబోతున్నాయి.
కార్మిక సంస్కరణలు, విదేశీ పెట్టుబడులు, ప్రైవేటీకరణ, బ్యాంకుల విలీనం వంటి పలు అంశాలను వ్యతిరేకిస్తూ యూనియన్లు సమ్మె చేస్తున్నాయి. నేటి భారత్ బంద్కు రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతుండటం గమనార్హం. కనీస వేతనం, సామాజిక ఆర్థిక భద్రత సహా 12 డిమాండ్లతో యూనియన్లు సమ్మె బాట పడుతున్నాయి.
‘జనవరి 8న సమ్మె జరుగుతోంది. సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు దేశ వ్యాప్తంగా స్ట్రైక్ చేస్తున్నాయి. ఇందులో ఏ ఉద్యోగి అయినా ఏ రూపంలోనైనా పాల్గొంటే.. తగిన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. వేతన తగ్గింపు, క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుంది’ అని ఉత్తర్వులు పేర్కొంటున్నాయి. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ విభాగాలకు చెందిన ఉద్యోగులందరికీ ఈ ఆర్డర్లు వెళ్లాయి.
ఉద్యోగులను సమ్మెకు అనుమతించేలా అధికారం కల్పించే చట్టబద్ధమైన నిబంధన లేదని కేంద్రం పేర్కొంది. సమ్మెకు దిగడం అనేది నిబంధనల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తన కిందకు వస్తుందని, ప్రభుత్వ ఉద్యోగుల దుష్ప్రవర్తనను చట్టప్రకారం పరిష్కరించాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు అనేక తీర్పులలో అంగీకరించింది.
కేంద్ర ప్రభుత్వం అలాగే ఆఫీసర్లకు తన కింద ఉన్న ఉద్యోగులకు, ఇతరులకు ఈ రోజు ఎలాంటి సెలవు ఇవ్వొద్దని సూచించింది. క్యాజువల్ లీవ్ లేదా ఇతర సెలవులను ఈ రోజు మంజూరు చేయొదదని పేర్కొంది. అలాగే ఉద్యోగులు ఆఫీస్ వచ్చే దారిలో ఎలాంటి అడ్డంకులు ఎదుర్కోకుండా చూసుకోవాలని ప్రభుత్వం సీఐఎస్ఎఫ్కు సూచించింది.
ఇకపోతే భారత్ బంద్లో బ్యాంక్ ఉద్యోగులు కూడా పాల్గొనబోతుండటంతో బ్యాంకింగ్ కార్యకలాపాలపై కూడా ప్రతికూల ప్రభావం పడనుంది. పలు చోట్లు పలు బ్యాంక్ బ్రాంచ్లు పనిచేయకపోవచ్చు. అలాగే ఏటీఎం సర్వీసులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవచ్చు. అందువల్ల బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.