యాప్నగరం

PF ఖాతాదారులకు మోదీ శుభవార్త.. ఆ నిర్ణయంతో 72 లక్షల మందికి ప్రయోజనం!

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీపికబురు అందించింది. పీఎఫ్ కంట్రిబ్యూషన్ భారాన్ని మరో మూడు నెలలపాటు భరిస్తామని స్పష్టం చేసింది.

Samayam Telugu 11 Aug 2020, 7:06 am

ప్రధానాంశాలు:

  • కేంద్రం కీలక నిర్ణయం
  • పీఎఫ్ కంట్రిబ్యూషన్ భారం ప్రభుత్వానిదే
  • మరో మూడు నెలలు ఈ ప్రయోజనం అందుబాటులో

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu epfo
కేంద్ర ప్రభుత్వం తాజాగా పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. మరో మూడు నెలలపాటు పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను కేంద్రమే భరించనుంది. దీంతో పీఎఫ్ చందాదారులకు ప్రయోజనం కలుగనుంది. కరోనా వైరస్ సమయంలో ఊరట లభించనుంది.
పీఎఫ్ అకౌంట్‌లో సాధారణంగా కంపెనీ 12 శాతం, ఉద్యోగి వేతనంలో 12 శాతం (బేసిక్, డీఏ) జమవుతూ వస్తుంది. అయితే కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వమే ఈ కంట్రిబ్యూషన్‌ను భరిస్తోంది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు మోదీ సర్కార్ పీఎఫ్ డబ్బులను మీ తరుపున, మీ కంపెనీ తరుపున ఈపీఎఫ్ ఖాతాలో జమచేస్తూ వచ్చింది.

Also Read: undefined

ఇలాగే మరో మూడు నెలలపాలు పీఎఫ్ కంట్రిబ్యూషన్ భారాన్ని కేంద్రమే భరించనుంది. అంటే జూన్ నుంచి ఆగస్ట్ వరకు పీఎఫ్ డబ్బులు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఫెసిలిటీ అందిస్తోంది.

తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై ఏకంగా రూ.4860 కోట్ల భారం పడనుంది. దాదాపు 72 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అలాగే గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్‌ను కూడా నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.