యాప్నగరం

మోడీ పాల‌న‌లో ఆ రెండు సెల్ఫ్ గోల్స్: మన్మోహన్

మోడీ పాల‌న‌లో ప్ర‌జ‌లు శిక్ష‌కు గుర‌వుతున్్నార‌ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమ‌ర్శ‌లు చేశారు. మోడీ పాలనలో ఆర్ధిక నిర్వహణ సరిగ్గా లేదని చెప్పారు మన్మోహన్ సింగ్

Samayam Telugu 7 May 2018, 3:25 pm
మోడీ పాలనలో పన్నుల భారం ఎక్కువైంది: మన్మోహన్
Samayam Telugu Manmohan-Singh in Bangalore

మోడీ పాల‌న‌లో ప్ర‌జ‌లు శిక్ష‌కు గుర‌వుతున్్నార‌ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమ‌ర్శ‌లు చేశారు. మోడీ పాలనలో ఆర్ధిక నిర్వహణ సరిగ్గా లేదని చెప్పారు మన్మోహన్ సింగ్. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరు న‌గ‌రంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు మన్మోహన్. బ్యాంకింగ్ వ్యవస్థపై సామాన్య జనం నమ్మకం కోల్పోతున్నారన్నారు. నగదు కొరతతో అనేక రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. నీరవ్ మోడీ దేశం దాటి నెలలు గడుస్తున్నా…మోడీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

మోడీ ప్ర‌భుత్వంలో జీఎస్టీ, నోట్ల ర‌ద్దు రెండు అతిపెద్ద త‌ప్పిదాల‌ని చెప్పిన సింగ్ ఈ రెండు నిర్ణ‌యాలు సూక్ష్మ‌, చిన్న‌,మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్రమ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపాయని, దీంతో అవి నాశ‌నం అయ్యాయ‌ని త‌ద్వారా ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వ‌చ్చింద‌న్నారు.
సామాన్యులు భరించలేని విధంగా మోడీ ప్రభుత్వం పెట్రోల్‌ ధరలు పెంచిందన్నారు. సామాన్యులపై పన్నుల భారం అధికమైందన్నారు.పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అమాంతం పెరగడంతో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు మన్మోహన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.