SUV Cars: కరోనా సంక్షోభం తర్వాత ఆటో రంగం ఇప్పుడిప్పుడే కోలుకునే బాట పట్టింది. లాజిస్టిక్స్ సమస్యలు, చిప్ కొరత, ముడిసరుకుల ధరలు పెరగడం వంటి వాటి వల్ల కార్ల ధరలను భారీగా పెంచాయి కంపెనీలు. అయితే ప్రస్తుతం ఈ సమస్యల నుంచి కార్ల కంపెనీలు కాస్త కోలుకున్నట్టు తెలుస్తోంది. కొత్త కార్ల లాంచ్లతో కార్ల కంపెనీలు వాహనదారుల ముందుకు వస్తున్నాయి. అయితే దేశీయ మార్కెట్లో కొన్ని పాపులర్ కార్లకు మాత్రం వెయిటింగ్ పిరియడ్ భారీగా పెరిగింది. కంపాక్ట్, మిడ్-సైజు ఎస్యూవీలకు పెండింగ్ ఆర్డర్లు పెరిగాయి. ఈ పెండింగ్ ఆర్డర్లలో మహింద్రా ఎక్స్యూవీ700కి ఎక్కువ వెయిటింగ్ పిరియడ్ ఉంది. కొన్ని ఎంపిక చేసిన వేరియంట్లకు వెయిటింగ్ పిరియడ్.. ఏడాది పైగానే ఉంది. ఈ కార్ల కోసం 5 లక్షల మందికి పైగా కస్టమర్లు వేచి చూస్తున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏ కారు కోసం ఎంత మంది వేచిచూస్తున్నారో చూద్దాం..
మారుతీ సుజుకి గ్రాండ్ విటారాను భారత్లో వచ్చే నెలలో లాంచ్ చేయబోతుంది. ఈ కారు బుకింగ్స్ను కంపెనీ అధికారిక డీలర్షిప్ల వద్ద, ఆన్లైన్లో ప్రారంభించింది. ఈ కారు లాంచ్కి ముందే విపరీతమైన డిమాండ్ వస్తుంది. సుమారు 1.2 లక్షల యూనిట్ల పెండింగ్ ఆర్డర్లతో గ్రాండ్ విటారా, కొత్త బ్రెజా కోసం కస్టమర్లు ఎక్కువగా వేచిచూస్తున్నారు. అలాగే ఎక్స్యూవీ700ని కూడా కస్టమర్లు అమితంగా ఇష్టపడుతున్నారు. 5, 7 సీట్లతో అమ్మకానికి వచ్చిన ఈ ఎక్స్యూవీ ధర ఎక్స్షోరూంలో రూ.13.18 లక్షల నుంచి రూ.24.58 లక్షలుగా ఉంది.
ఎక్స్యూవీ700 వెహికిల్తో మహింద్రా భారత మార్కెట్లో విజయవంతమైంది. కస్టమర్ల నుంచి ఈ వెహికిల్కి భారీ స్పందన వస్తోంది. 2022 ఆగస్టు నెలలో అత్యధిక వెయిటింగ్ పిరియడ్ కలిగిన వెహికిల్గా ఇదే ఉంది. మహింద్రా ఎక్స్యూవీ700 కావాలంటే కస్టమర్లు 21 నెలల వరకు వేచిచూడాల్సిందే. కియా కారెన్స్లో కూడా కొన్ని వేరియంట్ల కోసం కూడా 20 నెలలు వేచిచూడాల్సిన పరిస్థితి వస్తుంది.
Also Read :17 బ్యాంకుల డిపాజిటర్లకు గుడ్న్యూస్.. త్వరలోనే చేతికి రూ.5 లక్షల వరకు మనీ!
Also Read : హాస్పిటల్ బిల్లులని క్యాష్ రూపంలో చెల్లిస్తున్నారా..? అయితే మీ పనైనట్టే!
- మహింద్రా స్కార్పియో ఎన్ కోసం 1.5 లక్షల మంది కస్టమర్లు ఎదురుచూపులు
- హ్యుండాయ్ క్రెటా, వెన్యూ కోసం 1.45 లక్షల మంది కస్టమర్లు వెయిటింగ్
- మారుతీ సుజుకి బ్రెజా, గ్రాండ్ విటారా కోసం 1.2 లక్షల మంది ఎదురుచూపులు
- మహింద్రా ఎక్స్యూవీ700 కోసం లక్ష మంది కస్టమర్లు వెయిటింగ్
మారుతీ సుజుకి గ్రాండ్ విటారాను భారత్లో వచ్చే నెలలో లాంచ్ చేయబోతుంది. ఈ కారు బుకింగ్స్ను కంపెనీ అధికారిక డీలర్షిప్ల వద్ద, ఆన్లైన్లో ప్రారంభించింది. ఈ కారు లాంచ్కి ముందే విపరీతమైన డిమాండ్ వస్తుంది. సుమారు 1.2 లక్షల యూనిట్ల పెండింగ్ ఆర్డర్లతో గ్రాండ్ విటారా, కొత్త బ్రెజా కోసం కస్టమర్లు ఎక్కువగా వేచిచూస్తున్నారు. అలాగే ఎక్స్యూవీ700ని కూడా కస్టమర్లు అమితంగా ఇష్టపడుతున్నారు. 5, 7 సీట్లతో అమ్మకానికి వచ్చిన ఈ ఎక్స్యూవీ ధర ఎక్స్షోరూంలో రూ.13.18 లక్షల నుంచి రూ.24.58 లక్షలుగా ఉంది.
ఎక్స్యూవీ700 వెహికిల్తో మహింద్రా భారత మార్కెట్లో విజయవంతమైంది. కస్టమర్ల నుంచి ఈ వెహికిల్కి భారీ స్పందన వస్తోంది. 2022 ఆగస్టు నెలలో అత్యధిక వెయిటింగ్ పిరియడ్ కలిగిన వెహికిల్గా ఇదే ఉంది. మహింద్రా ఎక్స్యూవీ700 కావాలంటే కస్టమర్లు 21 నెలల వరకు వేచిచూడాల్సిందే. కియా కారెన్స్లో కూడా కొన్ని వేరియంట్ల కోసం కూడా 20 నెలలు వేచిచూడాల్సిన పరిస్థితి వస్తుంది.
Also Read :17 బ్యాంకుల డిపాజిటర్లకు గుడ్న్యూస్.. త్వరలోనే చేతికి రూ.5 లక్షల వరకు మనీ!
Also Read : హాస్పిటల్ బిల్లులని క్యాష్ రూపంలో చెల్లిస్తున్నారా..? అయితే మీ పనైనట్టే!