యాప్నగరం

తొమ్మిదేళ్లుగా ఈయన జీతంలో మార్పు లేదు!

దేశంలోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ సంస్థ అధినేత ముకేష్ తొమ్మిదేళ్లుగా ఒకే వేతన శ్రేణి ద్వారా అందే మొత్తాన్నే

Samayam Telugu 28 Jun 2017, 12:53 pm
దేశంలోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ సంస్థ అధినేత ముకేష్ తొమ్మిదేళ్లుగా ఒకే వేతన శ్రేణి ద్వారా అందే మొత్తాన్నే పొందుతున్నారు. 2008-09 ఆర్థిక సంవత్సరంలో ఆయన పొందిన వార్షిక వేతనం రూ.15 కోట్లు పొందగా.. 2016-17 సంవత్సరంలోనూ ఆయన అదే జీతాన్ని తీసుకుంటున్నారు. ఇతర భత్యాలతో కలిపి ముకేష్ ఆ మొత్తాన్ని స్వీకరిస్తున్నారు.
Samayam Telugu mukesh ambani keeps cap on his salary for nine years
తొమ్మిదేళ్లుగా ఈయన జీతంలో మార్పు లేదు!


రిలయన్స్ సంస్థల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఆయనకు రూ. 38.75 కోట్ల వార్షిక వేతనం ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. అయితే ఆయన ఆ మొత్తాన్ని పక్కనబెట్టి తొమ్మిదేళ్లుగా తీసుకుంటున్న రూ.15కోట్లు (అన్ని భత్యాలు కలిపి) స్వీకరిస్తున్నారని సంస్థ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ఇతరులకు ఆదర్శంగా ఉండాలనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ చెప్పింది. సీఈవోల జీతాభత్యాలు అదుపులో ఉండాలని 2009 అక్టోబర్ లో చర్చ జరిగినప్పుడు ముకేష్ తన జీతంపై తానే నియంత్రణ విధించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.