యాప్నగరం

Ambani: ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం.. కంపెనీకి రాజీనామా!

Reliance Jio: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన, బిలియనీర్ ముకేశ్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. జూన్ 27న ముకేశ్ అంబానీ రాజీనామాను ఆమోదించారు. తర్వాత ఆయన కుమారుడు ఆకాశ్ అంబానీని రిలయన్స్ జియో నూతన చైర్మన్‌గా నియమించారు. ఈయన ఐదేళ్ల కాలం వరకు పదవిలో కొనసాగుతారు. అంటే ముకేశ్ అంబానీ తర్వాతి తరం ఇప్పుడు వ్యాపార బాధ్యతలు చూసుకుంటున్నారని చెప్పుకోవచ్చు.

Authored byKhalimastan | Samayam Telugu 28 Jun 2022, 5:37 pm

ప్రధానాంశాలు:

  • ముకేశ్ అంబానీ కీలక నిర్ణయం
  • రిలయన్స్ జియో బోర్డు నుంచి వైదొలిగారు
  • ఆకాశ్ అంబానీ కొత్త చైర్మన్‌గా నియామకం
  • ఈయన పదవీ కాలం ఐదేళ్లు ఉంటుంది

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu mukesh ambani
ముకేశ్ అంబానీ రాజీనామా
Reliance Industries: ముకేశ్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ కొత్త చైర్మన్‌‌గా నియమితులయ్యారు. రిలయన్స్ జియో బోర్డు తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. జూన్ 27 నుంచి ముకేశ్ అంబానీ రాజీనామా అమలులోకి వచ్చింది. అలాగే పంకజ్ మోహన్ పవర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
అలాగే రమీందర్ సింగ్ గుజ్రాల్, కేవీ చౌదరీ వంటి వాళ్లు అదనపు డైరెక్టర్లుగా ఉంటారు. అలాగే స్వతంత్ర డైరెక్టర్ హోదా ఉంటుంది. కాగా ఆకాశ్ అంబానీ ఇది వరకు కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. రిలయన్స్ జియో కొత్త చైర్మన్‌గా ఆకాశ్ అంబానీతో పాటు ఇతరులు కూడా ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. 2022 జూన్ 27 నుంచి వీళ్ల టెన్యూర్ అమలులోకి వస్తుంది.

Also Read: undefined

2022 జూన్ 27న కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు సమావేశం అయ్యారు. ఇందులో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిలయన్స్ జియో స్టాక్స్ ఎక్స్చేంజీలకు ఈ విషయాన్ని తెలియజేసింది. కొత్త చైర్మన్‌గా ప్రస్తుతం నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న ఆకాశ్ అంబానీ నియామకానికి ఆమోదం తెలిపామని పేర్కొంది. కాగా రిలయన్స్ జియో దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీగా కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ నెలలో జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 16.8 లక్షల మేర పెరిగింది. కాగా కంపెనీ నికర లాభం 2021-22 ఆర్థిక సంవత్సరం క్యూ4లో 4,173 కోట్లుగా నమోదు అయ్యింది. మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 3615 కోట్లుగా ఉంది. అలాగే స్టాండలోన్ రెవెన్యూ రూ. 20,901 కోట్లుగా ఉంది. వార్షికంగా చూస్తే ఇందులో 20.4 శాతం పెరుగుదల నమోదు అయ్యింది.

రిలయన్స్ జియో కొత్త సేవలు
మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ సర్వీసెస్ విభాగం రిలయన్స్ జియో కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫైల్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ డిజిబాక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్టోరేజ్ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించనుంది. డిజిబాక్స్ 2020లో ఏర్పాటు అయ్యింది. ఇది డిజిటల్ ఫైల్ స్టోరేజ్, డిజిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్లా్ట్‌ఫామ్. ఇండివీజువల్స్, బిజినెస్‌లకు ఈ సంస్థ సేవలు అందిస్తోంది. జియో ఫోటోస్ యాప్ ద్వారా డిజిబాక్స్‌లో లాగిన్ అయితే మొత్తంగా 30 జీబీ వరు ఉచిత స్టోరేజ్ పొందొచ్చు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.