యాప్నగరం

Rajalakshmi Vijay: జాగింగ్ చేస్తుండగా ఢీకొట్టిన కారు.. టెక్ కంపెనీ సీఈఓ దుర్మరణం.. ఎంత పనైంది!

Rajalakshmi Vijay: మరో రోడ్డుప్రమాదం ఒక కంపెనీ సీఈఓను పొట్టనపెట్టుకుంది. జాగింగ్ చేస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆమె దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ముంబయి వర్లీ ప్రాంతంలో జరిగింది. దీంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 20 Mar 2023, 11:05 am
Rajalakshmi Vijay: ముంబయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక టెక్ కంపెనీ సీఈఓ చనిపోయారు. ఆల్ట్రుయిస్ట్ టెక్నాలజీస్ (Altruist Technologies) బాస్ రాజలక్ష్మి విజయ్ కారు ఢీకొనగా ప్రాణాలు కోల్పోయారు. వర్లీ సముద్ర తీరంలో ఆదివారం ఉదయం ఆమె జాగింగ్ చేస్తుండగా.. ఒక్కసారిగా వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె అంతెత్తున ఎగిరి పడ్డారు. తలకు తీవ్ర గాయాలు కాగా.. అక్కడికక్కడే చనిపోయినట్లు చూసినవారు చెబుతున్నారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపర్చనున్నారు. ఒక టెక్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చనిపోయిన నేపథ్యంలో.. ముంబయి టెక్ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Samayam Telugu tech firm ceo


ఇక రాజలక్ష్మి విషయానికి వస్తే ఆమె తరచూ జాగింగ్ చేస్తుంటారు. ఇటీవలే 2023 టాటా ముంబయి మారథాన్ కూడా పూర్తిచేశారు. ఆమె ఎప్పుడూ తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని చెబుతున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో మరణించడం జీర్ణించుకోలేకపోతున్నారు ఆమె కుటుంబసభ్యులు. మృతురాలి వయస్సు 57 సంవత్సరాలు.

ఆ కారు నడుపుతున్న వ్యక్తిని సుమెర్ ధర్మేష్ మర్చంట్‌గా గుర్తించారు. అతడిపై వివిధ కేసులు నమోదు చేసిన పోలీసులు.. కోర్టులో సోమవారం హాజరపర్చనున్నారు. పోలీస్ స్టేట్‌మెంట్‌లో మర్చంట్ పలు విషయాలు వెల్లడించాడు. అతడు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇక తన ఇంట్లో పార్టీ జరిగిన అనంతరం తన ఫ్రెండ్‌తో కలిసి మహిళా సహోద్యోగిని ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పాడు. అయితే.. పార్టీ జరిగిందని చెప్పిన నేపథ్యంలో అతడు నిద్ర మత్తులో ఉన్నాడా, మద్యం సేవించాడా అనే అనుమానంతో అతడి దగ్గర సాంపిల్స్ తీసుకున్నారు. తదుపరి విచారణ జరుగుతోంది.

Mobile Payments: అలా పేమెంట్లు అస్సలు చేయకండి.. సరికొత్త మోసం తెరపైకి.. 81 మంది దగ్గర రూ. కోటి లాగారు.. PPF Account: ఈ ప్రభుత్వ పథకం కోటీశ్వరుల్ని చేస్తుంది.. వడ్డీతోనే రూ.కోటికిపైగా లాభం.. ఇన్వెస్ట్‌మెంట్ తక్కువే..!

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.