యాప్నగరం

ఇన్ఫోసిస్‌లోకి నందన్ నిలేకని రీ ఎంట్రీ

వ్యాపారవర్గాలు ఊహించిందే జరిగింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎగ్జిక్యూటీవ్ చీఫ్ నందన్ నిలేకని ఇన్ఫోసిస్‌లోకి..

TNN 24 Aug 2017, 10:54 pm
వ్యాపారవర్గాలు ఊహించిందే జరిగింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎగ్జిక్యూటీవ్ చీఫ్ నందన్ నిలేకని ఇన్ఫోసిస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చుకున్నారు. నిలేకనిని నాన్ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్‌గా నియమిస్తూ ఇన్ఫోసిస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 26 ఏళ్ల వయస్సులో వున్నప్పుడు ఇన్ఫోసిస్‌ని స్థాపించిన వారిలో ఒకరైన నిలేకని 2009లో రెండవసారి అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వంతో కలిసి ఆధార్ ఆలోచనకి ప్రాణం పోశారు. ఆధార్ వెనుకున్న ఈ మాస్టర్ మైండ్ అప్పటి నుంచి యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ సంక్షోభంలో వున్న నేపథ్యంలో సంస్థని సంక్షోభం నుంచి బయటపడేసేందుకు నందన్ నిలేకని మరోసారి ఇన్ఫీ నాన్ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు.
Samayam Telugu nandan nilekani has returned to infosys as non executive chairman
ఇన్ఫోసిస్‌లోకి నందన్ నిలేకని రీ ఎంట్రీ


ఇదిలావుంటే, ఇన్ఫోసిస్ బోర్డు నుంచి తప్పుకుంటున్నట్టుగా ఇన్ఫోసిస్ ఛైర్మన్ ఆర్.శేషసాయి, కో చైర్మన్‌ రవి వెంకటేశన్‌, జెఫ్‌ లేమాన్‌లు చేసిన రాజీనామాలను సంస్థ అంగీకరించింది. దీంతో శేషసాయి, రవి వెంకటేషన్, జెఫ్ లేమాన్ ఇన్ఫోసిస్ బోర్డు నుంచి వైదొలిగారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.