National Pension System: Pension Rules Revised For Central Government Employees
ఉద్యోగులకు మోదీ బంపరాఫర్.. ఈ తేదీని మాత్రం మర్చిపోవద్దు.. లేదంటే..
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్న ఒక అంశానికి మోదీ సర్కార్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలుగనుంది.
Samayam Telugu20 Feb 2020, 3:04 pm
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్న ఒక అంశానికి మోదీ సర్కార్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలుగనుంది.
రెండు ఆప్షన్లు
కేంద్ర ప్రభుత్వం తాజాగా పెన్షన్ రూల్స్ను మార్చింది. ఉద్యోగులకు రెండు ఆప్షన్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎన్పీఎస్ నుంచి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్కు మారేందుకు అనుమతినిచ్చింది. అదేసమయంలో ఈ ఆప్షన్ వద్దనుకుంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లోనే కొనసాగే వెసులుబాటు కల్పించింది.
మోదీ సర్కార్ తాజా నిర్ణయం అందరికీ వర్తించదు. కొంత మందికి మాత్రమే వర్తిస్తుంది. 2004 జనవరి 1వ తేదీ లోపు ఉద్యోగం కన్ఫార్మ్ అయినా లేదా సర్వీస్లో చేరిన వారికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. 2004 జనవరి 1 లేదా ఆపైన ఉద్యోగంలో చేరిన వారికి మారే ఆప్షన్ ఉండదు.
కాగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గడువు విధించింది. అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2020 మే నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఉద్యోగులు ఒకవేళ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోకపోతే అప్పుడు వారు ఎన్పీఎస్లోనే కొనసాగుతారని స్పష్టత నిచ్చింది.
కాగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (సీఏటీ) ఇటీవల ఒక కేసుకు సంబంధించి 2004 జనవరి 1కి ముందే జాబ్ కన్ఫార్మ్ అయిపోయి సర్వీసులో చేరడానికి ఆలస్యం అయిన సందర్భాల్లో.. ఈ ఆలస్యాన్ని సాకుగా చూపిస్తూ వారిని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ నుంచి వారిని తప్పించడం కరెక్ట్ కాదని తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఈ ఆప్షన్ అందించడం గమనార్హం.
ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో చేరడానికి 2004 జనవరి 1 కటాఫ్ డేట్గా ఉంది. ఈ డేట్కు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం లభించిన వారికి ఈ పాత పెన్షన్ స్కీమ్లో చేరొచ్చు. ఇది వద్దనుకుంటే ఎన్పీఎస్లోనే కొనసాగవచ్చు.
కాగా అర్హత కలిగిన ఉద్యోగులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను ఎంచుకుంటే.. అప్పుడు వీరి ఎన్పీఎస్ అకౌంట్ క్లోజ్ అవుతుంది. ఎన్పీఎస్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి మారేందుకు అర్హత కలిగిన ఉద్యోగుల వివరాలు వెల్లడిస్తూ కేంద్రం 2020 సెప్టెంబర్ లోగా ఒక నోటిఫికేషన్ జారీ చేస్తుంది. 2020 నవంబర్ 1 నుంచి అర్హత కలిగిన ఉద్యోగుల ఎన్పీఎస్ అకౌంట్లు క్లోజ్ అవుతాయి.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.