యాప్నగరం

బంగారం కొనుగోళ్లపై బాంబు పేల్చనున్న కేంద్రం?

బంగారం కొనుగోలుదార్లకు ప్రభుత్వం మరోసారి షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. రూ. 50 వేలు దాటిన ఆభరణాల కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి అనే నిబంధనను శుక్రవారమే ఎత్తేసిన ప్రభుత్వం తాజాగా ఓ షాకిచ్చింది.

TNN 8 Oct 2017, 3:08 pm
బంగారం కొనుగోలుదార్లకు ప్రభుత్వం మరోసారి షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. రూ. 50 వేలు దాటిన ఆభరణాల కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి అనే నిబంధనను శుక్రవారమే ఎత్తేసిన ప్రభుత్వం తాజాగా ఓ షాకిచ్చింది. పాన్ తప్పనిసరనే నిబంధన తొలగించడం ద్వారా కొనుగోళ్లు ఊపందుకుంటాయని ఆభరణాల వ్యాపారులు భావించారు. కానీ బంగారం, ఇతర ఖరీదైన లోహాల కొనుగోళ్లపై ఊరట తాత్కాలికమేనని తేలింది. బంగారం కొనుగోళ్లపై కొత్త పరిమితిని విధించనున్నట్లు తెలుస్తోంది. బులియన్ మార్కెట్లోకి నల్లధనం మళ్లకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అదియా తెలిపారు.
Samayam Telugu new limit for reporting gold transactions soon
బంగారం కొనుగోళ్లపై బాంబు పేల్చనున్న కేంద్రం?


‘పాన్ తప్పనిసరి అనే నిబంధన బంగారం కొనుగోళ్లపై ప్రభావం చూపింది. దీంతో ఆభరణాల వ్యాపారులు ఈ నిబంధన తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. కానీ బ్యాంకు డిపాజిట్లు, ఇన్సూరెన్సుల తరహాలోనే మనీలాండరింగ్ చట్టం ప్రకారం అధిక విలువైన ఆభరణాల కొనుగోళ్లు కూడా ప్రభుత్వం దృష్టికి రావాలి’ అని అదియా తెలిపారు. ఈ విషయమై అధ్యయనం చేస్తాం. కొత్తగా ఎంత పరిమితి విధించాలనే విషయమై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. పసిడి వ్యాపార వర్గాలతో మాట్లాడిన తర్వాత ఓ నిర్ణయానికి వస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.