యాప్నగరం

Stock Market News: కొనుగోళ్ల అండతో మార్కెట్లకు లాభాలు

రూపాయి బలపడటం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, విదేశీ పెట్టుబడులు పెరగడంతో మదుపర్లు కొనుగోళ్ల వైపు మొగ్గుచూపారు.

Samayam Telugu 15 Nov 2018, 4:50 pm
గురువారం నాటి ట్రేడింగ్‌ను దేశీయ మార్కెట్లు లాభాలతో ముగించాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ.. కొనుగోళ్లు ఊపందుకోవడంతో సూచీలు లాభాల్లోకి పయనించాయి. రూపాయి బలపడటం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, విదేశీ పెట్టుబడులు పెరగడంతో మదుపర్లు కొనుగోళ్ల వైపు మొగ్గుచూపారు. దీంతో సూచీలు లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్‌లో జెట్ ఎయిర్ వేస్ 28 శాతం వృద్ధిని కనబరచింది. టాటాతో కుదుర్చుకున్న ఒప్పందం లాభాలకు కారణమైంది.
Samayam Telugu markets1


ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 118.55 పాయింట్ల లాభంతో 35260.54 వద్ద, నిఫ్టీ 40.40 పాయింట్లు లాభపడి 10616.70 వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ (+7.20), నిఫ్టీ మిడ్ క్యాప్ (+84.75) కూడా లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 28 పైసలు బలపడి 72.03 వద్ద ట్రేడ్ అవుతోంది.

అదానీ పోర్ట్స్(+4.28), టైటన్ కంపెనీ (+3.21), ఐషర్ మోటార్స్(+3.03), కొటక్ మహింద్రా (+2.86), హీరో మోటోకార్ప్(+2.62) షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు గ్రాసిమ్ (-7.72), యస్ బ్యాంక్ (-7.44), ఇండియాబుల్స్ హౌసింగ్ (-4.10), ఎన్టీపీసీ (-2.26) , భారతీ ఇన్‌ఫ్రాటెల్ (-1.79) తదితర షేర్లు నష్టాలను చవిచూశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.