యాప్నగరం

Stock Market News: కొనుగోళ్ల జోరు.. లాభాల్లో మార్కెట్లు

ఒకవైపు డాలరుతో రూపాయి మారకం విలువ బలపడటం.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల పరిణామాలతో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు.

Samayam Telugu 16 Nov 2018, 10:37 am
శుక్రవారం నాటి ట్రేడింగ్‌ను దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 138 పాయింట్ల లాభంతో 35,398 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిఫ్టీ కూడా లాభాలతోనే ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒకవైపు డాలరుతో రూపాయి మారకం విలువ బలపడటం.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల పరిణామాలతో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ప్రధానంగా ఫార్మా, ఐటీ, ఆటోమొబైల్ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి.
Samayam Telugu bull.


ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ 243.78 పాయింట్ల లాభంతో 35504.32 వద్ద, నిఫ్టీ 63.10 పాయింట్ల లాభంతో 10679.80 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 10 పైసలు బలపడి 71.87 వద్ద కొనసాగుతోంది.

ఎన్ఎస్‌ఈలో హెచ్‌సీఎల్ టెక్, విప్రో, రిలయన్స్, సిప్లా, భారతీ ఇన్‌ఫ్రాటెల్ తదితర సంస్థల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు యస్ బ్యాంక్, ఇండియాబుల్స హౌసింగ్, ఓఎన్‌జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తదితర సంస్థల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.