యాప్నగరం

Stock Market News: అమ్మకాల ఒత్తడి.. నష్టాల్లో సూచీలు

మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు ఆరంభం నుంచే ఒడుదొడుకులకు లోనవుతున్నాయి.

Samayam Telugu 20 Nov 2018, 10:20 am
సోమవారం లాభాలతో ట్రేడింగ్‌ను ముగించిన దేశీయ మార్కెట్లు.. మంగళవారం (నవంబరు 20) నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే సెన్సెక్స్‌ 40 పాయింట్ల నష్టంతో 35,730 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మరోవైపు నిఫ్టీ కూడా 10750 దిగువకు పతనమైంది. మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు ఆరంభం నుంచే ఒడుదొడుకులకు లోనవుతున్నాయి.
Samayam Telugu sensex-l-express-photo-1


ఉదయం 10.15 గంటల సమయానికి సెన్సెక్స్ 97 పాయింట్ల నష్టంతో 35680 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 10726 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 27 పైసలు బలపడి 71.38 వద్ద కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో గెయిల్, హెచ్‌పీసీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్ సంస్థల షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.. యస్ బ్యాంక్, టెక్ మహింద్రా, హెచ్‌సీఎల్ టెక్, హిండాల్కో, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ తదితర సంస్థల షేర్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.