యాప్నగరం

Stock Market News: ఫెడ్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

వడ్డీరేట్ల పెంపుపై ట్రంప్‌ ప్రభుత్వంతో 'ఫెడ్‌' రాజీ వైఖరి అవంభించవచ్చనే వార్తలు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది.

Samayam Telugu 29 Nov 2018, 11:12 am
భారత స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం ట్రేడింగ్‌ ఆరంభంలో సెన్సెక్స్ ‌350 పాయింట్ల లాభంతో మొదలైంది. అంత‌ర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా మార్కెట్ భారీ లాభాలు గ‌డించ‌డంతో నిఫ్టి ఓపెనింగ్‌లో 10800 స్థాయిని దాటింది. వడ్డీరేట్ల పెంపుపై ట్రంప్‌ ప్రభుత్వంతో 'ఫెడ్‌' రాజీ వైఖరి అవంభించవచ్చనే వార్తలు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. మరోవైపు శనివారం చైనా అధినేత జిన్‌పింగ్‌, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భేటీ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యయుద్ధ తీవ్రత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
Samayam Telugu sensex1


ఉదయం 11.00 గంటల సమయానికి సెన్సెక్స్ 368.53 పాయింట్ల లాభంతో 36085.48 వద్ద, నిప్టీ 97.6 పాయింట్ల స్వల్ప లాభంతో 10822 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 50 పైసలు బలపడి 70.05 వద్ద కొనసాగుతోంది.

ఎన్‌ఎస్ఈలో హిండాల్కో, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, వేదాంత, మహింద్రా & మహింద్రా తదితర షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. యస్ బ్యాంక్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఐవోసీ తదితర సంస్థల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.