యాప్నగరం

జీతాలు ఇవ్వలేను: ఉద్యోగులకు నీరవ్ షాక్!

నీరవ్ సంస్థల్లోని ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ బకాయిలు, జీతాలు చెల్లించాలని కోరుతూ రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.

TNN 23 Feb 2018, 3:44 pm
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసులో... రూ.11,400 కోట్ల భారీ స్కామ్‌తో దేశం వదిలి పారిపోయిన నగల వ్యాపారి నీరవ్ మోదీ తన ఉద్యోగులకు షాకిచ్చాడు. తాజాగా ఉద్యోగులను ఉద్దేశిస్తూ రాశిన లేఖలో.. ‘‘ప్రస్తుతం నా బ్యాంకు అకౌంట్లు, షోరూమ్, స్టాక్స్ తదితర ఆర్థిక సంబంధిత లావాదేవీలను సీజ్ చేసిన నేపథ్యంలో ఉద్యోగులకు జీతాలు, బకాయిలు చెల్లించలేను. ఈ సందర్భంగా మీరు వేరే ఉద్యోగాలు వెతుక్కోవడం మంచిది’’ అని తెలిపాడు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ బకాయిలు, జీతాలు చెల్లించాలని కోరుతూ రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం సూరత్‌లో నిరవ్ మోదీకి చెందిన ఉద్యోగులు తమ జీతాల కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
Samayam Telugu nirav modi letter to staff look for other jobs cant pay you now
జీతాలు ఇవ్వలేను: ఉద్యోగులకు నీరవ్ షాక్!

సూరత్‌లో ఉద్యోగుల ఆందోళన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.