యాప్నగరం

గుడ్ న్యూస్.. తగ్గిన వంట గ్యాస్ సిలిండర్.. తక్షణమే అమల్లోకి

ఫిబ్రవరి నెలలో రూ.150 పెరిగిన వంట గ్యాస్ ధర మార్చిలో తగ్గింది. నాన్ సబ్సిడీ వంట గ్యాస్ ధర రూ.53 తగ్గిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది.

Samayam Telugu 1 Mar 2020, 1:10 pm
వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. గత ఆరు నెలలుగా పెరుగుతున్న ఎల్పీజీ సిలిండర్ ధరలు తొలిసారిగా తగ్గాయి. నాన్ సబ్సిడీ ఎల్పీజీ ధరలు ఆగష్టు తర్వాత తగ్గడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆగష్టు, ఫిబ్రవరి నెలల మధ్య ఆరుసార్లు గ్యాస్ ధరలను సవరించగా.. వంట గ్యాస్ ధర దాదాపు 50 శాతం పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీ, ముంబై నగరాల్లో 14.2 కిలోల సిలిండర్‌ నాన్ సబ్సిడీ వంట గ్యాస్ ధర నేటి (మార్చి 1) నుంచి రూ.53 తగ్గింది. అలాగే 19 కిలోల సిలిండర్ ధర రూ.84.50 పైసలు తగ్గింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. ఇండెన్ బ్రాండ్‌ కింద వంట గ్యాస్ సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే.
Samayam Telugu gas cylinder


ఇప్పటి వరకూ ఢిల్లీలో నాన్ సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.858.5 ఉండగా.. మార్చి 1 నుంచి రూ. 805.5 చెల్లిస్తే సరిపోతుంది. ముంబైలో రూ. 829.5 చెల్లించగా ఇక నుంచి రూ.776.5 చెల్లించాల్సి ఉంటుంది.

19 కిలోల సిలిండర్ ధరలు ఢిల్లీలో రూ.1466 నుంచి రూ.1381.50కి తగ్గాయి. ముంబైలో రూ.1,540.50 నుంచి రూ.1,331.00కి తగ్గింది. ప్రతి నెలా వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలో నాన్ సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.150 పెరిగింది. అన్ని మెట్రో నగరాల్లో సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ ధరలు రూ.144.50 పైసల నుంచి రూ.149 మధ్య పెరిగాయి. ఒక్కో వినియోగదారుడు ఏడాదికి గరిష్టం 9 సిలిండర్ల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది. అంతకు మించి వాడితే సబ్సిడీ మొత్తం ఖాతాలో పడదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.