యాప్నగరం

ఇలా చేస్తే ముకేశ్ అంబానీని దాటేయొచ్చు.. సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్!

ఉల్లి ధర క్రమంగా కొండెక్కుతోంది. మార్కెట్‌లో సరఫరా తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉల్లి ధరపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ నడుస్తున్నాయి.

Samayam Telugu 30 Sep 2019, 10:32 am

ప్రధానాంశాలు:

  • సోషల్ మీడియాలో ఉల్లి ధరపై ట్రోల్స్
  • గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు
  • ఉల్లి ధర బాటలోనే బంగాళదుంప ధర కూడా
  • ధరల పెరుగుదల నేపథ్యంలో ఫన్నీ పోస్టులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu onion prices surge across the country people drop hilarious tweets
ఇలా చేస్తే ముకేశ్ అంబానీని దాటేయొచ్చు.. సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్!
ఉల్లి ధర ఘాటెక్కుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలుచోట్ల ఉల్లిపాయల ధరలు పెరిగాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఇందుకు కారణం. వర్షాలు, వరదల కారణంగా పంట దెబ్బతినడం సహా మహరాష్ట్ర, కర్నాటక నుంచి సరఫరా తగ్గడం వంటి పలు అంశాలు ధరపై ప్రభావం చూపాయి. తెలుగు రాష్ట్రాల్లో కేజీ ఉల్లి ధర రూ.60ను తాకింది. మరోవైపు ఉర్ల గడ్డ (బంగాళాదుంప) ధర కూడా పెరుగుతూ వస్తోంది.
ఉల్లి ధరల పెరుగుదల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్ నడుస్తున్నాయి. ఉల్లి అమ్ముకుంటే దేశంలోనే అత్యంత సంపన్నుడైన అంబానీని దాచ్చు.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రపోజ్ చేస్తూ ఉంగరం బదులు ఉల్లి గడ్డ ఇవ్వడం.. వంటి ట్రోల్స్ నడుస్తున్నాయి.






తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.