లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. ఆ డబ్బులు కుటుంబ సభ్యులు చెల్లించాలా?
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ రుణ డబ్బులు ఎవరు కట్టాలి? బ్యాంకులు ఆ డబ్బులను అలాగే వదిలేస్తాయా? లేదంటే రికవరీ చేస్తాయా? అసలు బ్యాంకులకు ఎలాంటి అధికారాలు ఉంటాయి? తెలుసుకోండి.
Samayam Telugu 14 Jun 2021, 5:57 am
ప్రధానాంశాలు:
- లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే?
- రుణ డబ్బులు ఎవరు కట్టాలి?
- కట్టకపోతే ఏమౌతుంది?
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడానికి చాలా మంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటూ ఉంటారు. కొంత మంది కొత్త ఇల్లు కొనేందుకు లేదంటే కొత్త ఇల్లు కట్టుకోవడానికి లోన్ తీసుకోవచ్చు. ఇంకొందరు ఇతరత్రా అవసరాల కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకొని ఉండొచ్చు. బ్యాంక్ నుంచి తనఖా లేని రుణాలు చాలా మంది పొందుతూ ఉంటారు. వీటిని పర్సనల్ లోన్ అని చెప్పొచ్చు. అలాగే ఏదైనా తనఖా పెట్టి కూడా కొంత మంది బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. వీటిని సెక్యూర్డ్ రుణాలు అని పిలుస్తారు. ఇంకా జాయింట్ లోన్స్ కూడా పొందుతూ ఉంటారు.
Also Read: undefined
పర్సనల్ లోన్స్ వంటి అన్సెక్యూర్డ్ రుణాల విషయానికి వస్తే.. లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. బ్యాంకులు వారి కుటుంబ సభ్యులను లోన్ డబ్బులు కట్టమని అడిగేందుకు వీలు లేదు. అదే సెక్యూ్ర్డ్ రుణలకు కూడా ఇదే వర్తిస్తుంది. లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. జీవించి ఉన్న వారిని బ్యాంకులు డబ్బులు కట్టమని కోరవు.
అయితే ఇక్కడ తనఖా పెట్టిన ప్రాపర్టీ లేదా ఇతర వస్తువులను బ్యాంకులు విక్రయించుకుంటాయి. ఇక జాయింట్ రుణాల విషయానికి వస్తే.. ఒక వ్యక్తి మరణిస్తే.. ఇంకొరు కచ్చితంగా రుణ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ రెండో వ్యక్తి డబ్బులు కట్టకపోతే బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.
Also Read: undefined
పర్సనల్ లోన్స్ వంటి అన్సెక్యూర్డ్ రుణాల విషయానికి వస్తే.. లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. బ్యాంకులు వారి కుటుంబ సభ్యులను లోన్ డబ్బులు కట్టమని అడిగేందుకు వీలు లేదు. అదే సెక్యూ్ర్డ్ రుణలకు కూడా ఇదే వర్తిస్తుంది. లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. జీవించి ఉన్న వారిని బ్యాంకులు డబ్బులు కట్టమని కోరవు.
అయితే ఇక్కడ తనఖా పెట్టిన ప్రాపర్టీ లేదా ఇతర వస్తువులను బ్యాంకులు విక్రయించుకుంటాయి. ఇక జాయింట్ రుణాల విషయానికి వస్తే.. ఒక వ్యక్తి మరణిస్తే.. ఇంకొరు కచ్చితంగా రుణ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ రెండో వ్యక్తి డబ్బులు కట్టకపోతే బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.