యాప్నగరం

ఐటీ జోరు..పెట్రోలు బేజారు...!

గురువారం (ఏప్రిల్ 12) నాటి స్టాక్‌ మార్కెట్లు మందకొడిగా ప్రారంభమయ్యాయి. అయిదు రోజుల పాటు లాభాలు గడించిన మార్కెట్లు ప్రస్తుతానికి నెమ్మదిగా సాగుతున్నాయి. బుధవారం (ఏప్రిల్ 11) ప్రభావంతో ముడి చమురు ధరలు పెరగడంతో సూచీలు మందగమనం దిశగా కదులుతున్నాయి.

TNN 12 Apr 2018, 1:38 pm
గురువారం (ఏప్రిల్ 12) నాటి స్టాక్‌ మార్కెట్లు మందకొడిగా ప్రారంభమయ్యాయి. అయిదు రోజుల పాటు లాభాలు గడించిన మార్కెట్లు ప్రస్తుతానికి నెమ్మదిగా సాగుతున్నాయి. బుధవారం (ఏప్రిల్ 11) ప్రభావంతో ముడి చమురు ధరలు పెరగడంతో సూచీలు మందగమనం దిశగా కదులుతున్నాయి. దీనికి అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనత కూడా తోడైంది. ఉదయం ప్రారంభంతోనే సెన్సెక్స్‌ 7 పాయింట్లు కోల్పోయి 33,932 వద్ద ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ కూడా ఆరంభంలోనే 19 పాయింట్ల కోల్పోయి 10,397 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం స్వల్ప లాభాలతోనే కొనసాగుతుండటం శుభపరిణామం. సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 34,000 వద్ద కొనసాగుతుంది. 11 పాయింట్ల స్వల్ప లాభంతో 10,427.50 వద్ద నిఫ్టీ కొనసాగుతుంది.
Samayam Telugu MARKET


ఐటీ షేర్లు మాత్రం బుధవారం నాటి జోరునే కొనసాగిస్తున్నాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ తదితర కంపెనీల షేర్లు లాభాల్లో నడుస్తున్నాయి. కోల్‌ ఇండియా, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, రెడ్డీస్‌ ల్యాబ్స్‌తోపాటు ఇతర సంస్థలతోపాటు 20 సంస్థల షేర్లు 52 వారాల కనిష్ఠ స్ఠాయికి దిగజారాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.