యాప్నగరం

OYO రూమ్స్ వ్యవస్థాపకుడు రితేశ్ ఇంట్లో విషాదం.. పెళ్లైన రెండు రోజులకే తండ్రి మృతి!

OYO Founder: ఓయో రూమ్స్ ఫౌండర్ రితేశ్ అగర్వాల్ (Ritesh Agarwal) ఇంట్లో పెను విషాదం నెలకొంది. ఆయన వివాహం జరిగిన రెండు రోజుల్లోనే రితేశ్ తండ్రి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదవశాత్తు 20వ అంతస్తు నుంచి పడిపోయారు. ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మార్చి 7వ తేదీనే రితేశ్ అగర్వాల్ వివాహం జరిగింది. ఇంతలోనే ఈ ప్రమాదం జరగటం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 10 Mar 2023, 6:52 pm
OYO Founder: ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్ (OYO Rooms Founder) ఇంట్లో విషాదం నెలకొంది. రితేశ్ తండ్రి రమేశ్ అగర్వాల్ ప్రమదావశాత్తు భవనంపై నుంచి పడి మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం హరియాణాలోని గురుగ్రామ్‌లో ఎత్తైన భవనం పై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. గురుగ్రామ్ సెక్టార్ 54లో ఉన్న డీఎల్‌ఎఫ్ క్రెస్ట్ సొసైటీలోని 20 అంతస్తు నుంచి పడిపోయినట్లు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.
Samayam Telugu Ritesh Agarwal
రితేశ్ అగర్వాల్


'భవనంపై నుంచి పడిపోయిన వ్యక్తిని చికిత్స నిమిత్తం హుటాహుటిన పరాస్ హాస్పిటల్‌కి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఎస్‌హెచ్‌ఓతో పాటు పోలీసు బృందం వెల్లింది. ప్రమాద స్థలంలోనే వాకబు చేయగా భవనంపై నుంచి పడిపోయిన వ్యక్తి రమేశ్ పర్సాద్ అగర్వాల్‌గా (Ramesh Agarwal) తెలిసింది. ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.' అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం రమేశ్ అగర్వాల్ పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అందించినట్లు తెలిపారు పోలీసులు.

రెండు రోజుల క్రితమే వివాహం..
ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్ (Ritesh Agarwal) వివాహం గీతాన్ష్ సూద్‌తో మార్చి 7వ తేదీన దిల్లీలోని తాజ్ ప్యాలస్‌లో జరిగింది. ఆయన వివాహ వేడుకల్లో చివరిసారిగా కనిపించారు రమేశ్ అగర్వాల్ (Ritesh Agarwal Father Dies). ఈ వివాహానికి ప్రపంచంలోని టాప్ టెక్ ఎంటర్‌ప్రినర్స్‌లో ఒకడిగా రితేశ్ నిలిచిన క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన పెళ్లికి జపనీస్ బిలియనీర్, సాప్ట్ బ్యాంక్ గ్రూప్ పౌండర్ మసయోషి కుమారుడు హాజరయ్యారు.

త‌మ‌కు మార్గ‌ద‌ర్శిగా నిరంత‌రం స్ఫూర్తి కలింగే వ్యక్తి ఈ రోజు మ‌ర‌ణించార‌ని భార‌మైన హృద‌యంతో వెల్ల‌డిస్తున్నామ‌ని రితేశ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. రమేశ్ అగర్వాల్ సంపూర్ణ‌ జీవితాన్ని గ‌డిపార‌ని పేర్కొన్నారు. రోజూ త‌మ‌తో పాటు మరెందరికో స్ఫూర్తి క‌లిగించేవార‌ని గుర్తు చేసుకున్నారు రితేశ్. రమేశ్ అగర్వాల్ మ‌ర‌ణం త‌మ కుటుంబానికి తీర‌ని లోట‌న్నారు. తన తండ్రి రమేశ్ అగర్వాల్ చూపిన బాట‌లో సంక్లిష్ట స‌మ‌యాన్ని అధిగ‌మిస్తామ‌ని పేర్కొన్నారు.

Also Read: UB City: ఆ ఫ్లాట్స్‌కు కళ్లు చెదిరే ధర.. రెంటు నెలకు రూ.10 లక్షలు.. అపార్ట్‌మెంట్‌కు రూ.30 కోట్లు!

Also Read: Ratan Tata: రతన్ టాటా తన 'ఇన్‌స్టా'లో ఫాలో అవుతోంది ఒకేఒక్క ప్రొఫైల్.. ఆ వ్యక్తి ఎవరు?
రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.