యాప్నగరం

PAN Card: పాన్ కార్డ్ కొత్త రూల్.. కొద్ది రోజులే సమయం!

మీ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు దాటుతుందా? అయితే, తప్పకుండా ఈ కొత్త నిబంధన గురించి తెలుసుకోవల్సిందే.

Samayam Telugu 22 Nov 2018, 8:38 pm
పాన్ కార్డ్ నిబంధనల్లో మార్పులు వస్తున్నాయ్. పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోడానికి ఇప్పటి వరకు ఉన్న క్రైటీరియాలో సవరణలు చేస్తూ ఆదాయ పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిబంధన కేవలం వ్యాపారులకు మాత్రమే వర్తించనుంది. పెద్దగా టర్నోవర్‌లేని చిరువ్యాపారులకు ఇప్పటివరకు పాన్ కార్డ్ తప్పకుండా ఉండాలనే నిబంధన లేదు.
Samayam Telugu Untitled1rs


ఇప్పటివరకు ఆర్థిక సంవత్సరంలో రూ.5 లక్షలు టర్నోవర్ దాటే వ్యాపార సంస్థలకు మాత్రమే పాన్‌కార్డ్‌ను తప్పనిసరనే అని నిబంధన ఉంది. తాజా సవరణ ప్రకారం.. ఈ పరిధిని రూ.2.5 లక్షలకు తగ్గించారు. అంటే, ఏటా రూ.2.5 లక్షలు టర్నోవర్ దాటే ప్రతి వ్యాపారికి ఇక పాన్‌కార్డ్ తప్పనిసరి. ఈ కొత్త నిబంధన డిసెంబరు 5 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఇది వ్యక్తులకు వర్తించదు. కేవలం వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుంది.

ఈ నిబంధన కిందికి వచ్చే వ్యాపారులంతా వచ్చే ఏడాది మే 31 కల్లా పాన్ కార్డులను పొందాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం బోగస్ కంపెనీల తేట తీయడానికి కూడా ఐటీ సిద్ధమవుతోంది. తాజా నిబంధనల ప్రకారం ఇకపై పాన్ కార్డులో తండ్రి పేరు కూడా తప్పనిసరి కాదు. ఒకవేళ తండ్రి లేని వ్యక్తులు తల్లి పేరు చెప్పినా ఆమోదించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.