యాప్నగరం

పేటీఎం కస్టమర్లపై సీబీఐ కేసు

డిజిటల్ వాలెట్ పేటీఎం వినియోగదారులపై సీబీఐ ఎఫ్‌ఐర్ నమోదు చేసింది.

TNN 16 Dec 2016, 5:26 pm
డిజిటల్ వాలెట్ పేటీఎం వినియోగదారులపై సీబీఐ ఎఫ్‌ఐర్ నమోదు చేసింది. తమను కొంత మంది వినియోగదారులు మోసం చేసి రూ. 6.15 లక్షలు కాజేసినట్లు పేటీఎం సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీబీఐ 15 మంది కస్టమర్లపై కేసు పెట్టింది. అయితే వీరంతా పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేసన్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులేనని సీబీఐ భావిస్తోంది.
Samayam Telugu paytm alleges 48 customers duped it cbi files fir
పేటీఎం కస్టమర్లపై సీబీఐ కేసు


‘సాధారణంగా పేటీఎంలో ఏదైనా వస్తువును కొనుగోలు చేసినపుడు దానిలో డిఫెక్ట్ ఉంటే మళ్లీ వెనక్కి తీసుకుంటాం. ఒకవేళ అది పాడైన వస్తువైతే దాన్ని అమ్మిన వ్యాపారికి పంపుతాం. ఇదంతా చేయడానికి కంపెనీకి ఒక టీం ఉంది. ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో అధికారికంగా లాగిన్ అయిన మా కంపెనీ కస్టమర్ ఎగ్జిక్యూటివ్‌లు కస్టమర్ల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకోవడం, వారికి రిఫండ్స్ ఇవ్వడం చేస్తారు’ అని సీబీఐకి ఫిర్యాదు చేసిన పేటీఎం లీగల్ మేనేజర్ ఎం. శివకుమార్ పేర్కొన్నారు.

అయితే డెలివరీ విజయవంతంగా పూర్తయిన ఆర్డర్లకు సైతం డబ్బులు తిరిగి చెల్లించడాన్ని గుర్తించామని శివకుమార్ వెల్లడించారు. మొత్తం 48 ఆర్డర్లకు సంబంధించి కస్టమర్లకు డబ్బులు తిరిగి చెల్లించారని, ఇది ఇంటి దొంగల పనేనని ఆరోపించారు. ఈ 48 ఆర్డర్లలో మొత్తం రూ. 6.15 లక్షలు వినియోగదారుల వాలెట్స్, బ్యాంక్ అకౌంట్లకు వెళ్లాయని చెప్పారు. ఈ మేరకు ఆయా కస్టమర్లపై పేటీఎం సీబీఐకి ఫిర్యాదు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.