యాప్నగరం

Pakistan: ధనికులు Petrol పై లీటర్‌కు రూ.100 ఎక్కువ కట్టాల్సిందే.. పేదోళ్ల కోసమే.. అక్కడ అమల్లోకి కొత్త విధానం

Pakistan: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో ఉన్న నేపథ్యంలో.. అక్కడ సబ్సిడీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీనిలో భాగంగా ధనవంతులు రూ.100 ఎక్కువ కట్టాల్సిందే. దీనిని పేదల కోసం ఉపయోగించనుంది.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 23 Mar 2023, 10:20 am
Pakistan: ప్రస్తుతం మన పొరుగు దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో (Pakistan Crisis) చిక్కుకుంది. అక్కడ పరిస్థితులు అతలాకుతలంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం (Pakistan Crisis) రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో అక్కడ అన్ని ధరలు పెరిగిపోయాయి. దీంతో తక్కువ ఆదాయం కలిగిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా అక్కడ రికార్డు స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది వాహనాలను బయటికి తీయలేని పరిస్థితి. ఇదే నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా తక్కువ ఆదాయం ఉన్న ప్రజలు లేదా పేదవారి కోసం పెట్రోలియం రిలీఫ్ ప్యాకేజీ తీసుకొచ్చింది. దీని కింద పెట్రోలియం ఉత్పత్తులపై వీరికి లీటర్‌పై రూ.100 సబ్సిడీ అందించనుంది.
Samayam Telugu petrol rates


అయితే ఈ సబ్సిడీ అమౌంట్‌ను ధనికుల వద్ద వసూలు చేయనున్నట్లు చెప్పారు పాకిస్థాన్ పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్. ఈ మేరకు అక్కడి డాన్ పత్రిక ఈయన వ్యాఖ్యలను ఉటంకించింది. ధనికుల దగ్గర లీటర్‌పై రూ.100 అధికంగా వసూలు చేయనుంది పాక్ సర్కార్. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఇక.. ధనికులకు పెట్రోలియం ఉత్పత్తులను మరింత ప్రియంగా మార్చి.. పేదోళ్లకు తక్కువకే అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు మసూద్. ధనికుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేసి.. వాటిని పేదోళ్ల కోసం ఫైనాన్సింగ్ చేయనున్నట్లు వివరించారు.

Bonus: ఉద్యోగులకు మొన్న 50 నెలల జీతం బోనస్.. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్.. కలలో ఊహించని రీతిలో ప్రకటనలు! Job Frauds: Work From Home స్కామ్.. లక్షలు పోగొట్టుకుంటున్నారు జాగ్రత్త.. మీరు ఇలా చేస్తున్నారా?

ఇక తక్కువ ఆదాయం ఉన్న వారు అంటే బడ్జెట్ మోటార్ సైకిళ్లు, రిక్షాలు, 800cc కార్లు, ఇతర చిన్న చిన్న కార్లు వంటి వాటిని ఈ జాబితాలో చేర్చింది. వీటిల్లో పెట్రోలియం ఉత్పత్తులపై రూ.100 సబ్సిడీ కింద ఇవ్వనుంది. ఇక ఇదే క్రమంలో ఇతర ఖరీదైన బైక్స్, లగ్జరీ వాహనాలు వంటి వాటిని ధనికుల జాబితాలో చేర్చింది. వారి దగ్గర రూ.100 అధికంగా వసూలు చేయనుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా 6 వారాల పాటు ఈ విధానాన్ని అమలు చేయనుంది.

ప్రస్తుతం పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 272గా ఉంది. డీజిల్ ధర రూ.293గా ఉంది. ఇదే సమయంలో కిరోసిన్ ఆయిల్ కూడా లీటర్‌కు రూ.190.29గా ఉంది. ధరలు ఇలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే పేదవారికి సబ్సిడీ ఇచ్చేందుకు మొగ్గుచూపింది పాక్ సర్కార్.

మీది Airtel సిమ్ అయితే శుభవార్త.. Jio కు కౌంటర్‌గా సరికొత్త ఆఫర్లు.. ఒకే సిమ్‌పై ఐదుగురికి! Job Cuts: మళ్లీ ఉద్యోగులకు కష్టాలు.. మొన్న 18 వేలు.. ఇప్పుడు 9 వేల మందికి లేఆఫ్.. ఆ కారణంతోనే..! RBI: Loan Recovery ఏజెంట్ల వేధింపులు, బెదిరింపులు.. ఆ బ్యాంక్‌కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన RBI.. కోట్ల జరిమానా!

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.