జీఎస్టీ గురించి ఏవేవో మాయమాటలు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం పెట్రోలు,డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయంలో అలసత్వం ప్రదర్శిస్తూనే ఉంది. రూ.80 కి పైగా పెట్రోలు చేరినప్పటి నుంచి తగ్గే సూచనలే లేకుండా పైపైకే పోతున్నది. ఇంధన ధరలతో సామాన్య,మధ్య తరగతి ప్రజలు సతమతమవుతన్నారు.
పండుగల సమయంలో నిత్యావసర వస్తువుల ధరలను నిర్ణయించే చమురు ధరల పెరుగుదల పరంపర తీవ్రతరమైంది. కేంద్ర ప్రభుత్వం చాప కింద నీరులా ప్రతి రోజు పైసలు..రూపాయి చొప్పున పెంచుకుంటూపోతోంది. ఢిల్లీ, గుర్గావ్ నగరాల్లో కాస్త ఫర్వాలేదనిపించినా ముంబయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ నగరాల్లో పెట్రోలు ధర రూ.80కి పైగా ఉంటూ వాహనదారుల నడ్డి విరుస్తోంది. ముంబయిలో మునుపెన్నడూ లేని విధంగా పెట్రోలు రూ.86ని దాటేసింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరల మార్పు ఈ కింది విధంగా ఉంది.
పండుగల సమయంలో నిత్యావసర వస్తువుల ధరలను నిర్ణయించే చమురు ధరల పెరుగుదల పరంపర తీవ్రతరమైంది. కేంద్ర ప్రభుత్వం చాప కింద నీరులా ప్రతి రోజు పైసలు..రూపాయి చొప్పున పెంచుకుంటూపోతోంది. ఢిల్లీ, గుర్గావ్ నగరాల్లో కాస్త ఫర్వాలేదనిపించినా ముంబయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ నగరాల్లో పెట్రోలు ధర రూ.80కి పైగా ఉంటూ వాహనదారుల నడ్డి విరుస్తోంది. ముంబయిలో మునుపెన్నడూ లేని విధంగా పెట్రోలు రూ.86ని దాటేసింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరల మార్పు ఈ కింది విధంగా ఉంది.
నగరం | పెట్రోలు ధర(రూ.) | డీజిల్ ధర(రూ.) |
ఢిల్లీ | 78.84 | 70.76 |
కోల్కత | 81.76 | 73.61 |
ముంబయి | 86.25 | 75.12 |
చెన్నై | 81.93 | 74.78 |
బెంగుళూరు | 81.40 | 73.03 |
హైదరాబాద్ | 83.59 | 76.97 |