యాప్నగరం

ఇదేం వడ్డన: నెల రోజుల్లో రూ. 4 పెరిగిన పెట్రోల్ ధర

పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ మారతాయని అనగానే వాహనదారులు ఇదేదో బాగుందే అనుకున్నారు.

TNN 24 Aug 2017, 10:34 am
పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ మారతాయని అనగానే వాహనదారులు ఇదేదో బాగుందే అనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నొప్పు తెలియకుండా బాదేస్తోంది. రోజూ పైసా పైసా పెంచుతూ ప్రజలు గ్రహించలేని విధంగా పైసలు గుంజేస్తోంది. పెట్రోల ధరను పైసా.. రెండు పైసలు పెంచుకుంటూ పోతూ నెల రోజుల వ్యవధిలోనే రూ. 4 మేర పెంచేసింది. మరి ఈ విషయాన్ని ప్రజలు, రాజకీయా పార్టీలు గమనిస్తున్నాయో లేదో తెలీదు కానీ ఒక్కరు కూడా దీని గురించి ప్రశ్నించకపోవడం గమనార్హం. ఇక డీజిల్ ధర పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలానే ఉంది.
Samayam Telugu petrol price hiked by rs 4 since july
ఇదేం వడ్డన: నెల రోజుల్లో రూ. 4 పెరిగిన పెట్రోల్ ధర


ఈ రోజు వారీ పద్ధతి రాకముందు చమురు సంస్థలు పెట్రో ధరలను 15 రోజులకు ఒకసారి సమీక్షించి కొత్త ధరలను ఖరారు చేసేవి. రెండు నెలల క్రితం దీన్ని రోజువారీ విధానానికి మార్చిన సంగతి తెలిసిందే. ఇలా రోజూ కొన్ని పైసల చొప్పున పెంచుకుంటూ పోతున్నారు. తగ్గిన దాఖలాలు చాలా తక్కువే. ఒకే రోజు పెట్రోల్ ధర 30 పైసలు వరకు పెంచిన సందర్భాలు ఉన్నాయి. కానీ తగ్గించడం మాత్రం చాలా తక్కువనే చెప్పాలి.

వాస్తవానికి ఈ పద్ధతి తొలుత వినియోగదారులకు లాభదాయకంగానే ఉంది. రోజుకు 25 పైసల నుంచి 50 పైసల వరకు తగ్గుతూ వచ్చింది. దీంతో వాహనదారులు కూడా ఈ పద్ధతి బాగుందే.. అని ఆనందం వ్యక్తం చేశారు. కానీ గత నెల రోజులుగా పెరుగుదలే తప్పితే తగ్గుదల కనిపించడం లేదు. మధ్యలో ఒకసారి డీజిల్ ధర మాత్రం తగ్గింది. అయితే చమురు సంస్థలు మాత్రం.. క్రూయిడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్లే పెట్రో ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూయిడ్ ఆయిల్ బ్యారెల్ ధర 52 డాలర్లుగా ఉంది. ఇది మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.