యాప్నగరం

మళ్లీ పైసల్లోనే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయ్

కర్ణాటక ఎన్నికలు ముగిశాక వరుసగా 16 రోజులు పెరగుతూ పోయిన పెట్రోల్, డీజిల్ ధరలు మెల్లగా దిగి వస్తున్నాయి.

Samayam Telugu 4 Jun 2018, 9:43 am
కర్ణాటక ఎన్నికలు ముగిశాక వరుసగా 16 రోజులు పెరగుతూ పోయిన పెట్రోల్, డీజిల్ ధరలు మెల్లగా దిగి వస్తున్నాయి. గత ఆరు రోజులుగా పైసల చొప్పున తగ్గుతూ వచ్చిన పెట్రోల్ ధరలు.. సోమవారం కూడా 15 పైసలు తగ్గాయి. ఈ ఏడు రోజులు కలిపి కూడా పెట్రోల్ ధర అర్ధ రూపాయి కంటే తక్కువగా (రూ. 47 పైసలు) తగ్గడం వాహనదారులను అసంతృప్తికి గురి చేస్తోంది. సోమవారం దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.77.96 పైసలుగా ఉంది. ముంబైలో రూ.85.77 పైసలుగా ఉందని ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ తెలిపింది.
Samayam Telugu petrol1


నిన్నటితో పోలిస్తే సోమవారం డీజిల్ ధర కూడా స్వల్పంగా తగ్గింది. ఆదివారం ఢిల్లీలో రూ.69.11 పైసలు ఉన్న డీజిల్ ధర నేడు 14 పైసలు తగ్గి రూ.68.97 పైసలుగా నమోదైంది. హైదరాబాద్‌లో సోమవారం నాటి ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ ధర రూ.82.59 పైసలు ఉండగా.. డీజిల్ ధర రూ.74.97 పైసలుగా ఉంది.

మే నెలలో 16 రోజుల్లోనే పెట్రోల్ ధర లీటర్‌కి రూ.3.80 పైసలు పెరగ్గా, డీజిల్ ధర రూ.3.38 పైసలు పెరగడం వాహనదారుల ఆగ్రహానికి కారణమైంది. కాగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతోనే పెరిగాయని చమురు సంస్థలు చెబుతున్నాయి. దీర్ఘకాలంలో పెట్రోల్ ధరలను తగ్గించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కేంద్రం తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.