యాప్నగరం

PM Kisan రూ.2 వేలు పొందే రైతులకు కేంద్రం శుభవార్త!

PM Kisan 12th Installment: భారత ప్రభుత్వం తాజాగా రైతులకు తీపికబురు అందించింది. పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందే వారికి ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. ఇకేవైసీ గడువు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఇంకా ఇకేవైసీ పూర్తి చేసుకోని రైతులు ఇకనైనా ఆ పని పూర్తి చేసుకోవడం ఉత్తమం. లేదంటే పీఎం కిసాన్ స్కీమ్ కింద వచ్చే తర్వాత విడత డబ్బులను పొందలేకపోవచ్చు. ఇకేవైసీ ప్రక్రియ సులభంగానే ఉంది.

Authored byKhalimastan | Samayam Telugu 18 Aug 2022, 1:34 pm

ప్రధానాంశాలు:

  • రైతులకు తీపికబురు అందించిన కేంద్ర ప్రభుత్వం
  • పీఎం కిసాన్ ఇకేవైనీ గడువు పొడిగింపు
  • దీంతో అన్నదాతలకు ఊరట కలుగనుంది
  • ఇంటి వద్ద నుంచే ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu farmers
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
PM Kisan Yojana: కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు తీపికబురు అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ స్కీమ్ కింద లబ్ధి పొందుతున్న రైతులకు ఊరట కలిగే విధంగా భారత ప్రభుత్వం తాజాగా పీఎం కిసాన్ ఇకేవైసీ గడువు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. సాధారణంగా ఇకేవైసీ గడువు ఇప్పటికే ముగిసింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ డెడ్‌లైన్‌ను మరోసారి పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో ఇప్పుడు రైతులు 2022 ఆగస్ట్ 31 వరకు ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు.
పీఎం కిసాన్ వెబ్‌సైట్ ప్రకారం.. పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఇకేవైసీ గడువు పొడిగించారు. 2022 ఆగస్ట్ 31 వరకు ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అందువల్ల రైతులు ఇంకా ఎవరైనా ఇకేవైసీ పూర్తి చేసుకోకపోతే మాత్రం వెంటనే ఆ పని ముగించుకోండి. ఎందుకంటే అన్నదాతులు ఇకేవైసీ చేసుకోకపోతే మాత్రం తదుపరి ఇన్‌స్టాల్‌మెంట్ రూ.2 వేలు రాకపోవచ్చు. ఈ డబ్బులు సెప్టెంబర్ 1న వచ్చే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.

Also Read: undefined

కాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. పీఎం కిసాన్ స్కీమ్ కింద అర్హులైన రైతులు అందరూ ప్రతి ఏటా రూ. 6 వేలు పొందుతున్నారు. అయితే ఈ డబ్బుల ఒకేసారి కాకుండా విడతల వారీగా వస్తున్నాయి. రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో ఈ డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ అవుతున్నాయి. నాలుగు నెలలకు ఒకసారి రూ. 2 వేలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు.

రైతులు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఓటీపీ ఆధారిత ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు. దీని కోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. లేదంటే అన్నదాతలు దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. బయోమెట్రిక్ ఇకేవైసీ కూడా ఉంది. ఎలాగైనాసరే ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే డబ్బులు పొందలేకపోవచ్చు. కాగా ఇకేవైసీ చేసుకోవాలని భావించే వారు ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ దగ్గరే ఉంచుకోవాలి. ఎందుకంటే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇకేవైనీ పూర్తి అవుతుంది. అందువల్ల డబ్బులు పొందాలని భావించే వెంటనే ఈ పనిని ముగించుకోండి.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.