యాప్నగరం

రైతుల అకౌంట్లలోకి రూ.2 వేలు.. వచ్చేది ఆరోజే?

కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు రూ.2 వేలు అందించేందుకు రెడీ అవుతోంది. పీఎం కిసాన్ పదో విడత డబ్బులను డిసెంబర్ 15న రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.

Samayam Telugu 26 Oct 2021, 9:29 am
మోదీ సర్కార్ రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వచ్చి చేరతాయి. ఇప్పటికే పలు మార్లు అన్నదాతలకు డబ్బులు అందాయి.
Samayam Telugu farmers


కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరోసారి పీఎం కిసాన్ డబ్బులు అందించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ కింద ఈసారి రైతులకు పదో విడత డబ్బులు అందనున్నాయి. అంటే ఇప్పటికే రైతుల బ్యాంక్ ఖాతాల్లో 9 విడతల డబ్బులు జమ అయ్యాయి.

Also Read: undefined

పదో విడత డబ్బులు డిసెంబర్ 15న రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి చేరొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే మోదీ సర్కార్ ఈ తేదీని లాక్ చేసినట్లు తెలిపాయి. అందువల్ల అన్నదాతలకు డిసెంబర్ నెలలో రూ.2 వేలు అందనున్నాయి. ఇది పదో విడత డబ్బులు.

ఇకపోతే పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరిన రైతులకు ప్రతి ఏటా రూ.6 వేలు లభిస్తున్న విషయం తెలిసిందే. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున రైతులకు అందుతున్నాయి. కాగా మరోవైపు కేంద్రం ఈ డబ్బులను రెట్టింపు చేయొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.