యాప్నగరం

PM Kisan Yojana: రైతుల అకౌంట్లలోకి ఇక రూ.10 వేలు? మోదీ అదిరిపోయే కానుక!

అన్నదాతలను ప్రసన్నం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఈసారి బడ్జెట్‌లో పీఎం కిసాన్ స్కీమ్ కింద అందించే డబ్బుల మొత్తాన్ని పెంచే ఛాన్స్ ఉందని నివేదికలు వెలువడుతున్నాయి.

Samayam Telugu 14 Jan 2021, 11:50 am

ప్రధానాంశాలు:

  • రైతులకు కేంద్రం తీపిబురు
  • బడ్జెట్‌లో కీలక ప్రకటన
  • పీఎం కిసాన్ డబ్బులు పెంపునకు ఛాన్స్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu pm kisan scheme
కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో రైతుల కోసం పలు రకాల పథకాలు ఉన్నాయి. వీటిల్లోకెల్లా అందరికీ తెలిసిన స్కీమ్ పీఎం కిసాన్ స్కీమ్. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులు ఏడాదికి రూ.6 వేలు పొందొచ్చు. ఈ డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి.
అయితే ఇక్కడ పీఎం కిసాన్ డబ్బులు రూ.6,000 ఒకేసారి బ్యాంక్ ఖాతాల్లో పడవు. ఏడాదికి మూడు విడతల్లో అంటే రూ.2,000 చొప్పున రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి వస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు తీపికబురు అందించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: undefined

మోదీ సర్కార్ వచ్చే బడ్జెట్‌లో రైతులకు అందించే కిసాన్ డబ్బులను పెంచొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులను రూ.6 వేల నుంచి రూ.10,000కు పెంచొచ్చని నివేదికలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే రైతులకు చాలా బెనిఫిట్ కలుగనుంది.

కాగా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ 2021ను ప్రవేశపట్టడానికి సిద్ధమౌతోంది. ఇప్పటికే బడ్జెట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన నేపథ్యంలో మోదీ సర్కార్ ఎలాంటి బడ్జెట్ తీసుకువస్తుందోనని అందరిలోనూ భారీ అంచనాలున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.