యాప్నగరం

రైతులకు మరో శుభవార్త.. ఈరోజే మరో రూ. లక్ష కోట్లు విడుదల

రూ.1 లక్ష కోట్ల నిధుల ద్వారా దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులకు కావల్సిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు వీలు కలుగుతుంది. రైతులు పండించిన పంట నష్టపోకుండా ఆదుకునే వీలుంటుంది.

Samayam Telugu 9 Aug 2020, 8:09 am
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో వ్యవసాయ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా అనేక పథకాల్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. రైతలకు అండగా ఉండేలా వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. తాజాగా అన్నదాతలకు కావల్సిన మౌలిక వసతులను కల్పించేందుకు గాను రూ.1 లక్ష కోట్ల నిధులను మంజూరు చేయనున్నారు మోదీ. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ నిధులను విడుదల చేస్తారు. అలాగే పీఎం కిసాన్ స్కీం కింద దేశంలోని 8.5 కోట్ల మంది రైతులకు 6వ విడతగా రూ.17వేల కోట్లను కూడా ఆయన విడుదల చేస్తారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu రైతులకు మరో శుభవార్త
pm modi to launch agriculture infrastructure fund


ప్రధాని మోదీ విడుదల చేయనున్న రూ.1 లక్ష కోట్ల నిధుల ద్వారా దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులకు కావల్సిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు వీలు కలుగుతుంది. రైతుల పంటల కోత అనంతరం నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్‌లు, కలెక్షన్ సెంటర్లు,ప్రాసెసింగ్ యూనిట్లు, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. దీని వల్ల రైతుల పంటలకు ఎక్కువ లాభం వస్తుంది. అలాగే రైతులు తమ పంటలను ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకుని ఎలాంటి నష్టం లేకుండా అమ్ముకోవచ్చు. ఆయా సదుపాయాల నిర్మాణానికి గాను అవసరమైన రుణాలను అందించేందుకే సదరు రూ.1 లక్ష కోట్లను వినియోగిస్తారు.
Read More: రైతులకు మోదీ శుభవార్త.. ఈరోజే ఖాతాల్లోకి రూ.17వేల కోట్లు
అగ్రికల్చరల్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ఆ నిధులను మోదీ విడుదల చేస్తారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని లక్షలాదిమంది రైతులు,కో ఆపరేటివ్‌లు, పౌరులు కూడా ఈ కార్యక్రమాన్ని చూడవచ్చని పీఎంఓ ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.