యాప్నగరం

శుభవార్త.. రైతులు, మహిళలు, సామాన్యులకు తక్కువ వడ్డీకే రుణాలు!

బ్యాంకులతో మోదీ సమావేశమయ్యారు. ప్రజలకు సులభంగానే చౌక వడ్డీకే రుణాలు అందించాలని కోరారు. అప్పుడే వీరు కరోనా కష్టాల నుంచి బయటపడగలరని తెలిపారు. క్రెడిట్ గ్రోత్‌ను పెంచుకోవాలని సూచించారు.

Samayam Telugu 30 Jul 2020, 1:08 pm

ప్రధానాంశాలు:

  • బ్యాంకులతో మోదీ మీటింగ్
  • పలు అంశాలపై చర్చ
  • ప్రజలకు సులభంగా రుణాలు అందించాలని ఆదేశం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu pm modi
మహిళలు, రైతులు, సామాన్యులకు మోదీ తీపికబురు అందించారు. కరోనా కష్టాల నుంచి ప్రజలు త్వరితగతిన బయటపడాలంటే బ్యాంకులు వారికి సులభంగా రుణాలు అందించాలని పేర్కొన్నారు. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC)లతో మోదీ సమావేశమయ్యారు. సామాన్యులకు, చిన్న వ్యాపారాలకు చౌక వడ్డీకే రుణాలు అందించాలని బ్యాంకులను, ఎన్‌బీఎఫ్‌సీలను కోరారు.
పీఎంవో ప్రకారం.. భవిష్యత్ కార్యచరణ గురించి సమావేశంలో మోదీ, బ్యాంకుల మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. దేశాభివృద్ధిలో బ్యాంకింగ్ వ్యవస్థ, ఫైనాన్షియల్ రంగ పాత్ర గురించి కూడా చర్చ జరిగింది. చిన్న వ్యాపారులు, స్వయం సహాయక గ్రూప్స్, రైతులకు సులభంగా రుణాలు ఇవ్వలన్నీ మోదీ బ్యాంకులను కోరారు.

Also Read: undefined

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన మీటింగ్‌లో ఎంఎస్ఎంఈలకు రుణాలు, అదనపు కేసీసీ కార్డ్స్ (కిసాన్ క్రెడిట్ కార్డులు), ఎన్‌బీఎఫ్‌సీలు సహా ఎంఎఫ్‌ఐలకు లిక్విడిటీ వంటి అంశాల గురించి కూడా సమీక్ష జరిగింది. పస్తుత పరిస్థితుల్లో లబ్ధిదారులకు కచ్చితంగా ఆర్థిక తోడ్పాటు అందించాలని మోదీ తెలిపారు.

ఇకపోతే ప్రధాని మోదీ ఈరోజు రిజర్వు బ్యాంక్, సెబీ హెడ్స్‌తో సమావేశం నిర్వహించే అవకాశముంది. కాగా కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. కరోనా కేసుల ఇప్పటికే 15 లక్షలు దాటిపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.