యాప్నగరం

మోదీ ఫొటో వాడినందుకు జియోకు మొట్టికాయలు!

నరేంద్ర మోదీ దేశానికే కాదు మాకు కూడా ప్రధాన మంత్రే అన్న రీతిలో రిలయన్స్ జియో, పేటీఎం తమ ప్రకటనల్లో ఆయన ఫొటోను వాడేసుకున్నాయి.

TNN 4 Feb 2017, 5:31 pm
నరేంద్ర మోదీ దేశానికే కాదు మాకు కూడా ప్రధాన మంత్రే అన్న రీతిలో రిలయన్స్ జియో, పేటీఎం తమ ప్రకటనల్లో ఆయన ఫొటోను వాడేసుకున్నాయి. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా దేశ ప్రధాని ఫొటోను వ్యాపార స్వలాభానికి వాడుకున్న జియో, పేటీఎంలకు ఇప్పుడు ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ఈ విషయాన్ని వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది.
Samayam Telugu pm narendra modis photo lands paytm reliance jio in soup
మోదీ ఫొటో వాడినందుకు జియోకు మొట్టికాయలు!


ఈ తప్పిదానికి జియో, పేటీఎంపై పెనాల్టీ కూడా వేయనున్నట్లు అధికారులు స్పష్టం చేసారు. యాంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్, 1950 కింద ముందస్తు అనుమతి లేకుండా ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తల ఫొటోలు లేదా యాంబ్లమ్‌లు వాడటం నిషేధం. అయితే రిలయన్స్ జియో మాత్రం మోదీ ఫొటోతో ఒక ఫుల్ పేజ్ ప్రకటనను ఇచ్చింది. అలాగే పేటీఎం కూడా మోదీ డీమానిటైజేషన్ నిర్ణయాన్ని స్వాగతించిచడే కాకుండా తమ డిజిటల్ వాలెట్‌ను వినియోగించాలని ప్రకటనలు విడుదల చేసింది. కాగా, నోటీసులుపై జియో, పేటీఎం వివరణ ఇవ్వాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.