కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. ఇందులో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కూడా ఒకటి. రైతుల కోసం కేంద్రం ఈ స్కీమ్ను తీసుకువచ్చింది. అకాల లేదా అధిక వర్షపాతం వల్ల పంట దెబ్బతింటే ఈ పథకం కింద పరిహారం పొందొచ్చు. అన్నదాతలకు ఊరట కలిగించే స్కీమ్ ఇదని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం 2016 జనవరి 13న ఈ పథకాన్ని ఆవిష్కరించింది. నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ స్థానంలో దీన్ని తీసుకువచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ పంటకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ కింద ఖరీఫ్ పంటలకు ఇన్సూరెన్స్ కోసం అప్లై చేసుకోవడానికి జూలై 31తో గడువు ముగిసిపోతుంది. అందువల్ల ఈ గడువులోపు ఇన్సూరెన్స్ కోసం అప్లై చేసుకోవాలి.
Also Read: undefined
ప్రకృతి విపత్తు కారణంగా పంట విత్తడం నుంచి కోయడం మధ్యలో ఏమైనా నష్టం వాటిల్లితేనే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తిస్తుంది. ఖరీఫ్ పంటలకు రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియంలో 2 శాతం, రబీ పంటలకు ఇన్సూరెన్స్ ప్రీమియంలో 1.5 శాతం చెల్లిస్తే సరిపోతుంది. అదే వాణిజ్య పంటలు, హార్టికల్చర్ పంటలకు ప్రీమియంలో 5 శాతం కట్టాలి. మిగతా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.
Also Read:undefined
Also Read:undefined
అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. పంట నష్టం జరిగిందనితెలియగానే రైతుల బ్యాంక్ అకౌంట్లకు బీమా మొత్తంలో 25 శాతాన్ని జమ చేస్తారు. పంట నష్టాన్ని అంచనా వేయడానికి టెక్నాలజీని ఉపయోగిస్తారు.
ఉదాహరణకు రైతులు వరి పంట వేశారని భావిద్దాం. ఒక హెక్టార్లో వరి పడిస్తున్నారు. ఈ పంటకు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ కింద ఇన్సూరెన్స్ తీసుకుంటే.. రైతులు రూ.1600 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతుల తరుపున కేంద్ర ప్రభుత్వం రూ.10,328 ప్రీమియం చెల్లిస్తుంది. అకాల వర్షం కారణంగా పంట దెబ్బతింటే అప్పుడు ఇన్సూరెన్స్ స్కీమమ్ కింద రైతులకు రూ.80,000 లభిస్తాయి.
Also Read: undefined
ప్రకృతి విపత్తు కారణంగా పంట విత్తడం నుంచి కోయడం మధ్యలో ఏమైనా నష్టం వాటిల్లితేనే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తిస్తుంది. ఖరీఫ్ పంటలకు రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియంలో 2 శాతం, రబీ పంటలకు ఇన్సూరెన్స్ ప్రీమియంలో 1.5 శాతం చెల్లిస్తే సరిపోతుంది. అదే వాణిజ్య పంటలు, హార్టికల్చర్ పంటలకు ప్రీమియంలో 5 శాతం కట్టాలి. మిగతా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.
Also Read:undefined
Also Read:undefined
అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. పంట నష్టం జరిగిందనితెలియగానే రైతుల బ్యాంక్ అకౌంట్లకు బీమా మొత్తంలో 25 శాతాన్ని జమ చేస్తారు. పంట నష్టాన్ని అంచనా వేయడానికి టెక్నాలజీని ఉపయోగిస్తారు.
ఉదాహరణకు రైతులు వరి పంట వేశారని భావిద్దాం. ఒక హెక్టార్లో వరి పడిస్తున్నారు. ఈ పంటకు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ కింద ఇన్సూరెన్స్ తీసుకుంటే.. రైతులు రూ.1600 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతుల తరుపున కేంద్ర ప్రభుత్వం రూ.10,328 ప్రీమియం చెల్లిస్తుంది. అకాల వర్షం కారణంగా పంట దెబ్బతింటే అప్పుడు ఇన్సూరెన్స్ స్కీమమ్ కింద రైతులకు రూ.80,000 లభిస్తాయి.