యాప్నగరం

LIC స్కీమ్ అదుర్స్.. చేరితే ప్రతి నెలా చేతికి రూ.9,250!

చేతిలో డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని యోచిస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. ఎల్ఐసీ నుంచి ఒక స్కీమ్ ఉంది. ఇందులో ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా చేతికి ఆదాయం లభిస్తుంది.

Samayam Telugu 8 Jun 2020, 9:47 am
దేశీ దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కస్టమర్లకు ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. ఇందులో ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్ కూడా ఒకటి. ఎల్‌ఐసీ ఇటీవలనే ఈ స్కీమ్‌ను సంబంధించిన పలు మార్పులు చేసింది. మళ్లీ కొత్తగా ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది.
Samayam Telugu lic news


కేవలం ఎల్‌ఐసీ మాత్రమే ఈ స్కీమ్‌ను అందిస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్‌లో చేరిన వారు పదేళ్ల పాటు స్థిర వడ్డీ రేటుతో ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. మూడు ఆర్థిక సంవత్సరాలపాటు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. అంటే మార్చి 2023 వరకు స్కీమ్‌లో చేరొచ్చు. ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ ద్వారా ఈ స్కీమ్‌లో చేరేందుకు అవకాశముంది.

Also Read: undefined

ఎల్‌ఐసీ వయ వందన యోజన స్కీమ్ మెచ్యూరిటీ కాలం పదేళ్లు. తొలి ఏడాది 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు ఈ స్కీమ్‌లో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. మీరు ప్రతి నెలా రూ.9,250 ఆదాయం పొందొచ్చు. 60 లేదా ఆపైన వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరొచ్చు. గరిష్టంగా ఈ స్కీమ్‌లో ఒక వ్యక్తి రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు.

ఈ పథకంలో చేరిన వారు ఒకవేళ మరణిస్తే.. అప్పుడు చెల్లించిన డబ్బును భాగస్వామికి అందజేస్తారు. అంతేకాకుండా ఎల్ఐసీ వయ వందన యోజన స్కీమ్‌లో చేరిన వారికి లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుపై 75 శాతం వరకు తిరిగి లోన్ తీసుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.