యాప్నగరం

PNB Rule: ఈ బ్యాంక్‌లో 'సేవింగ్స్' అకౌంట్ ఉందా? అలా చేయకపోతే ఛార్జీల మోతే.. త్వరలో కొత్త రూల్స్!

PNB Rule: భారత ప్రభుత్వ రంగం అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక మార్పులు చేయబోతోంది. ఛార్జీల మోతతో తమ కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైది. సేవింగ్స్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్, ఏటీఎం డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల ఛార్జీలు భారీగా పెంచనున్నట్లు తెలుస్తోంది. సవరించిన ఛార్జీలు మే 1 నుంచే అమలులోకి వస్తాయని బ్యాంకు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆ వివరాలేంటో ిప్పుడు మనం తెలుసుకుందాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 3 Apr 2023, 1:05 pm
PNB Rule: మీకు ప్రభుత్వ రంగం బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉందా? అయితే మీకో హెచ్చరిక. మే 1 నుంచి మీ జేబుకు చిల్లు పడే అవకాశం ఉంది. ఖాతాదారులకు ఛార్జీల పేరుతో షాక్ ఇచ్చేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ( Punjab National Bank) సిద్ధమైంది. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసినా, సేవింగ్స్ ఖాతాలో (Savings Account Minimum Balance) తగినంత బ్యాలెన్స్ ఉంచకపోయినా ఛార్జీల మోతే మోగిపోనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలులోకి తీసుకురానుంది పీఎన్‌బీ. మీ ఖాతాలో సరిపడ డబ్బులు లేని సందర్భంలో ఏటీఎం నుంచి విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించినా మీపై ఛార్జీలు వసూలు చేయనుంది.
Samayam Telugu PNB SB.


పీఎన్‌బీ వెబ్‌సైట్ (PNB Bank New Rule) ప్రకారం మీ పొదుపు ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేనప్పుడు మీరు ఏటీఎం నుంచి డబ్బులు తీయలేరు. అలా ప్రయత్నిస్తే మీపై రూ.10 ఛార్జీలు వసూలు చేస్తుంది బ్యాంక్. దానిపై జీఎస్‌టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కస్టమర్లకు ఓ ప్రకటన చేసింది పీఎన్‌బీ. 'డియర్ కస్టమర్స్ మే 1, 2023 నుంచి ఖాతాలో సరిపడా డబ్బులు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించి ట్రాన్సాక్షన్ విఫలమైనట్లయితే రూ.10 ప్లస్ జీఎస్‌టీ ఛార్జీలు పడతాయి.' అని స్పష్టం చేసింది.

డెబిట్ కార్డు ఛార్జీల్లో మార్పులు..
పీఎన్‌బీ తమ డెబిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డుల జారీ ఛార్జీలు, వార్షిక నిర్వహణ ఛార్జీల్లో కీలక మార్పులు చేసింది. దాంతో పాటు డెబిట్ కార్డు ద్వారా నిర్వహించే పీఓఎస్, ఇ-కామర్స్ ట్రాన్సాక్షన్లపైనా ఛార్జీలు వసూలు చేసేందుకు నిర్ణయించింది. అయితే, కస్టమర్ పొదుపు ఖాతాలో తగింత బ్యాలెన్స్ లేని సందర్భంలోనే ఈ ఛార్జీలు పడతాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ సంస్థలు, పీఓఎస్ డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్లు బ్యాలెన్స్ లేని కారణంగా ఫెయిల్ అయితే ఛార్జీల మోత మోగిపోనుంది. నగరంలోని పీఎన్‌బీ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉంటే కనీస బ్యాలెన్స్ రూ.10,000 ఉండాలి. అలాగే అర్బణ్ శాఖలో రూ.5,000, గ్రామీణ ప్రాంతంలోని బ్యాంకు శాఖలో ఖాతా ఉంటే రూ.2.500 కనీస బ్యాలెన్స్ ఉండాలి.

ఫెయిల్డ్ ఏటీఎం గైడ్‌లైన్స్..
  • ఏటీఎం ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ల గురించి ఏడు రోజుల్లోకే ఫిర్యాదు చేయాలి.
  • ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ల విషయంలో 30 రోజుల్లో సమస్య పరిష్కారం కాని సందర్భంలో ఆ తర్వాత రోజుకు రూ.100 చొప్పున బ్యాంకు చెల్లిస్తుంది.
  • మీకు బ్యాంకు, ఏటీఎం లావాదేవీకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు ఉంటే 0120-2490000 or 18001802222, 1800 103 2222 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.