యాప్నగరం

Lending Rates: ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ కీలక ప్రకటన.. కస్టమర్లపై ఎఫెక్ట్.. ఏం చేసిందంటే?

Lending Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేటును పెంచిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే ఆయా బ్యాంకులు అన్ని రకాల లోన్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. గురువారం రోజు బ్యాంక్ ఆఫ్ బరోడా హోం లోన్లు పెంచగా.. ఇప్పుడు ప్రభుత్వ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా లెండింగ్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 10 Feb 2023, 3:50 pm
Lending Rates: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లెండింగ్ రేట్లను పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం రోజు రెపో రేటును పెంచిన నేపథ్యంలో.. దీనికి అనుగుణంగా ఆయా బ్యాంకులు వివిధ రకాల లోన్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. క్రితం రోజు బ్యాంక్ ఆఫ్ బరోడా హోం లోన్లపై లెండింగ్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించగా.. తాజాగా ఆ జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి చేరింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్.. రెపో లింక్డ్ లెండింగ్ రేటును (RLLR) 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో ఇంతకుముందు రెపో ఆధారిత వడ్డీ రేటు 8.75 శాతంగా ఉండగా.. ఇప్పుడు 9 శాతానికి చేరింది. గురువారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది.
Samayam Telugu lending rates


వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు, గురువారం నుంచే అమల్లోకి వస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్.. తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతుంటాయి. ఈ బుధవారం భారతీయ రిజర్వ్ బ్యాంక్.. రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. అంతకుముందు డిసెంబర్‌లో 35 బేసిస్ పాయింట్లు, అంతుకముందు వరుసగా 4 సార్లు 50 బేసిస్ పాయింట్ల చొప్పున రెపో రేటును పెంచాయి.

RBI Repo Rate: సామాన్యులపై మళ్లీ ఈఎంఐల మోత.. వడ్డీ రేట్లు పెంచిన ఆర్‌బీఐ.. ఎక్కువ కట్టాల్సిందే!

Loan EMI: వడ్డీ రేట్లు పెంచిన ఆర్‌బీఐ.. ఇది మీ లోన్ ఈఎంఐలపై ఎలా ప్రభావం చూపుతుందంటే?

గతేడాది మే లో 4 శాతంగా ఉన్న రెపో రేటు ఇప్పుడు ఏకంగా 6.50 శాతానికి చేరింది. అంటే ఈ 10 నెలల కాలంలో.. 250 బేసిస్ పాయింట్లు లేదా 2.50 శాతం మేర రెపో రేటు పెరిగిందన్నమాట. RBI రెపో రేటును పెంచిన వెంటనే.. బ్యాంకులు ఈ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తాయి. ఆయా రకాల రుణాలపై వడ్డీ రేట్లను పెంచేస్తాయి. ఇదే సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు పెంచుతుంటాయి. ఇది మాత్రం ఊరట కలిగించే అంశం. దీంతో బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగేందుకు ఛాన్స్ ఉంటుంది.

Read Latest Business News and Telugu News
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.