యాప్నగరం

చేతులు కాలాకా... ఆకులు పట్టుకున్న పీఎన్‌బీ...!

ఇష్టానుసారంగా ఆర్థికవ్యవహారాలు నడిపి... జరగాల్సిన నష్టమంతా జరిగాక... ఇప్పుడు తమ సంస్థాగత లోపాలను చక్కదిద్దుకోవడంపై దృష్టి సారించింది పంజాబ్ నేషన్ బ్యాంకు.

TNN 18 Mar 2018, 3:05 pm
చేతులు కాలాకా... ఆకులు పట్టుకున్న చందంగా ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంకు పరిస్థితి. దేశంలోని పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంకు భారీ కుంభకోణంతో కుదేలైన సంగతి తెలిసిందే. నీవర్ మోడీ దెబ్బకు ఆర్థికవ్యవస్థలో పీఎన్‌బీ స్థాయి దిగజారింది. ఇష్టానుసారంగా ఆర్థికవ్యవహారాలు నడిపి... జరగాల్సిన నష్టమంతా జరిగాక... ఇప్పుడు తమ సంస్థాగత లోపాలను చక్కదిద్దుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తమ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా అంతర్గత ఆడిట్‌ల సంఖ్యను పెంచి... మొండి బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని నిర్ణయించింది. రీక్యాపిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా ప్రిఫరెన్షియల్ షేర్ల ద్వారా ప్రభుత్వానికి ఇచ్చే వాటాను ఆమోదించేందుకు పీఎన్‌బీ ఈ సమావేశాన్ని నిర్వహించింది.
Samayam Telugu pnb scam bank to focus on internal audits recovery small depositors
చేతులు కాలాకా... ఆకులు పట్టుకున్న పీఎన్‌బీ...!


వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ భారీ కుంభకోణానికి పాల్పడటంతో పీఎన్‌బీ దాదాపు రూ.13,600 కోట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంపై పీఎన్‌బీ తమ భాగస్వాముల నుంచి అభిప్రాయాలను స్వీకరించి, అంతర్గత లోపాలను సరిదిద్దుకునేందుకు బహుముఖ వ్యూహాన్ని రూపొందించుకుంది.

ఈ వ్యూహంలో భాగంగా ఇకమీదట అంతర్గత ఆడిట్‌ల సంఖ్యను పెంపొందించడంతో పాటు అవసరమైనప్పుడు వెలుపలి ఆడిటర్ల సేవలను సైతం ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. అలాగే మొండి బకాయిల వసూలుపై మరింత దృష్టి సారించాలని నిశ్చయించుకున్నట్లు ఆ బ్యాంకు వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.