యాప్నగరం

Government Schemes: ఒక్కసారి డబ్బులు పెడితే చాలు.. ఏటా రూ.30 వేలు పొందొచ్చు!

Monthly Income Scheme : మీరు ఎక్కడైనా డబ్బులు పెట్టాలని చూస్తున్నారా? అయితే రిస్క్ ఉండకుడదని భావిస్తున్నారా? అయితే మీకోసం ఒక స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో డబ్బలు పెడితే కచ్చితమైన రాబడి వస్తుంది. అలాగే పెట్టిన డబ్బులుకు ఎలాంటి భయం అక్కర్లుదు. డబ్బులు పూర్తి సురక్షితం. మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఏటా రూ. 30 వేలు వరకు పొందొచ్చు. ఇలా మీకు ఐదేళ్ల పాటు డబ్బులు లభిస్తాయి.

Authored byKhalimastan | Samayam Telugu 6 Jul 2022, 1:26 pm

ప్రధానాంశాలు:

  • పలు రకాల స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో
  • రిస్క్ లేకుండా రాబడి సొంతం చేసుకోవచ్చు
  • మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు..
  • అవసరం అనుకుంటే మళ్లీ ఐదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu money
వన్‌టైమ్ ఇన్వెస్ట్‌మెంట్... ప్రతి ఏటా లాభం
Saving Schemes: రిస్క్ లేకుండా ఆకర్షణీయ రాబడి పొందాలని చూస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. పలు రకాల సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి. వీటిల్లో మీకు నచ్చిన పథకాన్ని ఎంచుకోవచ్చు. ఇలాంటి పథకాల్లో పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఒకటుంది. ఇందులో డబ్బులు పెడితే రిస్క్ ఉండదు. మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయి. అలాగే రాబడి కింద వడ్డీ మొత్తాన్ని పొందొచ్చు. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ గడువు ఐదేళ్లు. సింగిల్ అకౌంట్, జాయింట్ అకౌంట్ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. సింగిల్ అకౌంట్ అయితే రూ. 4.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే జాయింట్ అకౌంట్ అయితే రూ. 9 లక్షల దాకా డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు.
మీరు డిపాజిట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే రాబడి కూడా ఆధారపడి ఉంటుంది. మీరు సింగిల్ అకౌంట్ తెరిచి, అందులో రూ. 4.5 లక్షల దాకా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే.. అప్పుడు మీకు ప్రతి ఏటా చేతికి రూ. 29,700 లభిస్తాయి. ఇలా మీరు ఐదేళ్ల దాకా డబ్బులు పొందుతూనే ఉండొచ్చు. తర్వాత మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను వెనక్కి తీసుకోవచ్చు. లేదంటే మళ్లీ ఐదేళ్లపాటు స్కీమ్ మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకోవచ్చు. అంటే మీరు ఐదేళ్లలో వడ్డీ రూపంలో దాదాపు రూ.లక్షన్నర పొందొచ్చు.

Also Read: undefined

ప్రస్తుతం పోస్టాఫీస్ ఎంఐఎస్ స్కీమ్ పైన 6.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. వడ్డీ రేటు అనేది మూడు నెలలకు ఒకసారి మారొచ్చు. లేదంటే స్థిరంగా కూడా ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను త్రైమాసికం చొప్పున సమీక్షిస్తూ వస్తుంది. మీరు రూ.1000 కనీస ఇన్వెస్ట్‌మెంట్‌తో పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. వడ్డీ డబ్బులు ప్రతి నెల పొందొచ్చు.

పోస్టాఫీస్ ఎంఐఎస్ స్కీమ్ గడువు కన్నా ముందే డబ్బులు తీసుకుంటే చార్జీలు చెల్లించుకోవాలి. కనీసం ఏడాది తర్వాతనే ప్రిమెచ్యూర్ విత్‌డ్రాయెల్ ఫెసిలిటీ ఉంటుంది. దాదాపు 2 శాతం వరకు చార్జీలు పడతాయి. అందువల్ల డబ్బులు పెట్టిన వారు మెచ్యూరిటీ వరకు వేచి ఉండటం ఉత్తమం అని చెప్పుకోవచ్చు. నామినేషన్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ అకౌంట్‌ను ఒక పోస్టాఫీస్ నుంచి మరో పోస్టాఫీస్‌కు మార్చుకోవచ్చు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.