Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: Pay Rs 330 Per Year To Get Rs 2 Lakh Cover
Modi జీవన్ జ్యోతి స్కీమ్: రూ.330తో రూ.2 లక్షల ప్రయోజనం!
కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ను అందిస్తోంది. ప్రజల సామాజిక ఆర్థిక భద్రత లక్ష్యంగా ఈ పథకాలను ఆఫర్ చేస్తోంది. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) కూడా ఇందులో ఒక భాగమే. ఇది ఒక నాన్ లింక్డ్, నాన్ పార్టిపిపేటింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్. మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ఆఫర్ చేస్తోంది.
Samayam Telugu11 Dec 2019, 10:54 am
కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ను అందిస్తోంది. ప్రజల సామాజిక ఆర్థిక భద్రత లక్ష్యంగా ఈ పథకాలను ఆఫర్ చేస్తోంది. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) కూడా ఇందులో ఒక భాగమే. ఇది ఒక నాన్ లింక్డ్, నాన్ పార్టిపిపేటింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్. మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ఆఫర్ చేస్తోంది.
ఎవరికి వర్తిస్తుంది?
18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనాసరే ఈ స్కీమ్లో చేరొచ్చు. జీవన్ జ్యోతి బీమా యోజన వల్ల స్కీమ్లో చేరిన వారికి జీవిత బీమా 55 ఏళ్ల వరకు వర్తిస్తుంది. బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారు ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్ సభలో ఈ స్కీమ్ గురించి మాట్లాడారు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో 5.91 కోట్ల మంది చేరారని తెలిపారు. అలాగే ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో 15.47 కోట్ల మంది చేరారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ రెండు సామాజిక భద్రత స్కీమ్స్ను 2015లో ఆవిష్కరించింది.
జనసురక్ష్ వెబ్సైట్ ప్రకారం.. జీవన్ జ్యోతి బీమా యోజన పతకంలో చేరిన వారికి రూ.2 లక్షల లైఫ్ కవర్ లభిస్తుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు ఈ సదుపాయం ఉంటుంది. దీనికోసం ఏడాదికి ఒకసారి రూ.330 చెల్లించాలి. ప్రతి సంవత్సరం ఇలా రూ.330 చెల్లిస్తూ రావాలి. అప్పుడు ప్రతి ఏడాది రూ.2 లక్షల కవరేజ్ లభిస్తుంది.
బ్యాంక్ అకౌంట్ ఉన్న వారు ఈ పాలసీ తీసుకున్న తర్వాత ప్రీమియం మొత్తం ప్రతి ఏడాది అకౌంట్ నుంచి ఆటోమేటిక్గానే కట్ అవుతుంది. దీని కోసం మీరు బ్యాంక్ను సంప్రదించండి. లేదంటే ఆన్లైన్లో బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఆటోమేటిక్ డెబిట్ ఫీచర్ ఓకే చేసుకోవచ్చు. పాలసీ కూడా ఆన్లైన్లోనే తీసుకోవచ్చు. ఇదేసమయంలో ఆటో డెబిట్ ఫీచర్ ఓకే చేసుకోవాలి.
పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షలు అందుతాయి. తక్కువ ప్రీమియం మొత్తంతో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. అందువల్ల ఈ పాలసీ తీసుకోవడం మంచిదే. పాలసీ తీసుకునే సమయంలో కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. 55 ఏళ్లు దాటిన తర్వాత పాలసీ కవరేజ్ లభించదు.
బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసుకుంటే ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కస్టమర్లకు అందుబాటులో ఉండదు. అందువల్ల బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసుకునే సమయంలో ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. అలాగే అకౌంట్లో సరిపడినంత బ్యాలెన్స్ లేకపోతే, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించకపోతే అప్పుడు కూడా పాలసీ వర్తించదు. ఒక బ్యాంక్ అకౌంట్ ద్వారా ఒక ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే తీసుకోవలసి ఉంటుంది.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.