యాప్నగరం

ఈ 2 బ్యాంకులకు కేంద్రం మంగళం.. అమ్మకానికి సర్వం సిద్ధం?

కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయనుంది. ఇప్పటికే ప్రభుత్వం ఆ బ్యాంకులను గుర్తించిందని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంకుల ప్రైవేటీకరణ పూర్తి కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అందువల్ల నిర్ణయం అమలు ఆలస్యం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను మాత్రమే కాకుండా ఒక ఇన్సూరెన్స్ కంపెనీని కూడా ప్రైవేటీకరణ చేయనుంది. బడ్జెట్‌లోనే కేంద్ర ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.

Authored byKhalimastan | Samayam Telugu 18 May 2022, 8:24 am

ప్రధానాంశాలు:

  • బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధం అవుతోందా?
  • మరో రెండు బ్యాంకుల్లో వాటాలను విక్రయించే ఛాన్స్
  • లిస్ట్‌లో ఏ ఏ బ్యాంకులు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం
  • అలాగే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ప్రైవేటీకరణ జరగనుంది

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nirmala Sitharaman
ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే పలు కంపెనీల్లో వాటాలు విక్రయించింది. ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ వస్తోంది. ప్రభుత్వం త్వరలో మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా ప్రైవేట్ పరం చేయనుందని తెలుస్తోంది. పలు కంపెనీలు కూడా ఈ ప్రైవేటీకరణపై ఉత్సాహం చూపుతున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ బ్యాంకులు ప్రైవేటీకరణ ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. మరోవైపు బ్యాంక్ ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తూ వస్తున్నారు. దీని వల్ల ప్రైవేటీకరణ ఆలస్యం అవుతూ వస్తోందని చెప్పుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో విదేశీ యాజమాన్య పరిమితిని తొలగించాలని భావిస్తోంది. ప్రస్తుతం 20 శాతం పరిమితి ఉంది. దీన్ని తొలగించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. దీని కోసం బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌కు సవరణలు చేయడానికి సిద్ధం అవుతోంది. అలాగే ప్రైవేటీకరణ చేయాల్సిన ఆ రెండు బ్యాంకులను కూడా ప్రభుత్వం ఇప్పటికే గుర్తించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

Also Read: undefined

మీడియా నివేదికల ప్రకారం చూస్తే.. రెండు బ్యాంకులు ప్రైవేటీకరణ పనులు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. అయితే కేంద్ర కేబినెట్ ఆమోదం లభించడానికి మరి కొంత కాలం పట్టొచ్చు. తొలిగా కనీసం ఒక్క బ్యాంక్ ప్రైవేటీకరణను అయినా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. శాసన ప్రక్రియ పూర్తయిన తర్వాత, పెట్టుబడుల ఉపసంహరణపై మంత్రుల బృందం ప్రైవేటీకరణ కోసం బ్యాంకుల పేర్లను ఖరారు చేస్తుంది.

కాగా మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బ్యాంకులు ప్రైవేటీకరణ అంశం గురించి బడ్జెట్‌లో ప్రస్తావించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 బ్యాంకులు ప్రైవేటీకరణ ఉంటుందని వెల్లడించారు. నీతి ఆయోగ్ కూడా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎంపిక చేసేసింది. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ లను ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉంది. ఈ బ్యాంకులు మాత్రమే కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీని కూడా ప్రైవేటీకరణ చేస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

Also Read: undefined

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.