అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం 'క్వాల్కామ్' సంస్థ హైదరాబాద్లో అతిపెద్ద క్యాంప్స్ను ఏర్పాటు చేయనుంది. సుమారు 400 మిలియన్ డాలర్ల (రూ.3,000 కోట్లు) పెట్టుబడితో ఈ క్యాంప్సను నెలకొల్పనుంంది. అమెరికా వెలుపల క్వాల్కామ్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద క్యాంపస్ ఇదే కావటం విశేషం. శనివారం (అక్టోబరు 6) తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావుతో క్వాల్కామ్ వైస్ ప్రెసిడెంట్ (ఇంజనీరింగ్) శశి రెడ్డి, డైరెక్టర్ చంద్ర శేఖర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో పెట్టనున్న వివరాలు, అభివృద్ధి ప్రణాళికలు వారు మంత్రికి వివరించారు.
హైదరాబాద్కు మరిన్ని కంపెనీలు: కేటీఆర్
అమెరికాలోని శాన్డియాగో ప్రధాన కార్యాలయం తర్వాత అంత భారీ స్థాయిలో మెగా క్యాంపస్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయటం ఎంతో సంతోషాన్నిస్తోందని అన్నారు. క్వాల్కామ్ భారీ క్యాంపస్.. ఎలక్ట్రానిక్, సెమికండక్టర్ పరిశ్రమ వృద్ధికి మరింత ఊతమివ్వనుందని తెలిపారు. దీంతో మరికొన్ని కంపెనీలు హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్ విభాగంలోకి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు.
5జీ టెక్నాలజీపై పరిశోధనలు: క్వాల్కమ్ వైస్ ప్రెసిడెంట్
ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపస్లో 5జీ టెక్నాలజీపై పరిశోధనలు, అభివృద్ధి, టెస్టింగ్ వంటి కార్యకలాపాలను నిర్వహించనున్నారు. మొబైల్ కమ్యూనికేషన్ను మరింత మందికి చేరువ చేయటమే కాకుండా వైర్లెస్ విప్లవాన్ని తీసుకురావటంలో క్వాల్కామ్ కీలకంగా ఉండనుందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ శశి రెడ్డి తెలిపారు. క్వాల్కామ్ ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. 2004లో హైదరాబాద్లో సంస్థ కార్యకలాపాలను ప్రారంభించిందని, ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 4,000గా ఉందని ఆయన వివరించారు. మెగా క్యాంపస్ అందుబాటులోకి వస్తే ఉద్యోగుల సంఖ్య పదివేలకు చేరుకోనుందని చెప్పారు.
వచ్చే ఏడాది పనులు ప్రారంభం
2019లో ప్రాంగణ ఏర్పాటు పనులను ప్రారంభించనున్నారు.హైదరాబాద్లోని కోకాపేట ఐటీ క్లస్టర్లో 17 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మెగాక్యాంప్సను ఏర్పాటు చేయనున్నారు. దీనిద్వారా దాదాపు 10 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. క్వాల్కామ్.. అమెరికా సహా భారత్, ఇజ్రాయిల్, సింగపూర్, చైనా, పశ్చిమ యూర్పల్లోని వివిధ ప్రాంతాల్లో 167 కార్యాలయాలతో పాటు ఆర్ అండ్ డి సెంటర్లను నిర్వహిస్తోంది.
హైదరాబాద్కు మరిన్ని కంపెనీలు: కేటీఆర్
అమెరికాలోని శాన్డియాగో ప్రధాన కార్యాలయం తర్వాత అంత భారీ స్థాయిలో మెగా క్యాంపస్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయటం ఎంతో సంతోషాన్నిస్తోందని అన్నారు. క్వాల్కామ్ భారీ క్యాంపస్.. ఎలక్ట్రానిక్, సెమికండక్టర్ పరిశ్రమ వృద్ధికి మరింత ఊతమివ్వనుందని తెలిపారు. దీంతో మరికొన్ని కంపెనీలు హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్ విభాగంలోకి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు.
5జీ టెక్నాలజీపై పరిశోధనలు: క్వాల్కమ్ వైస్ ప్రెసిడెంట్
ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపస్లో 5జీ టెక్నాలజీపై పరిశోధనలు, అభివృద్ధి, టెస్టింగ్ వంటి కార్యకలాపాలను నిర్వహించనున్నారు. మొబైల్ కమ్యూనికేషన్ను మరింత మందికి చేరువ చేయటమే కాకుండా వైర్లెస్ విప్లవాన్ని తీసుకురావటంలో క్వాల్కామ్ కీలకంగా ఉండనుందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ శశి రెడ్డి తెలిపారు. క్వాల్కామ్ ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. 2004లో హైదరాబాద్లో సంస్థ కార్యకలాపాలను ప్రారంభించిందని, ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 4,000గా ఉందని ఆయన వివరించారు. మెగా క్యాంపస్ అందుబాటులోకి వస్తే ఉద్యోగుల సంఖ్య పదివేలకు చేరుకోనుందని చెప్పారు.
వచ్చే ఏడాది పనులు ప్రారంభం
2019లో ప్రాంగణ ఏర్పాటు పనులను ప్రారంభించనున్నారు.హైదరాబాద్లోని కోకాపేట ఐటీ క్లస్టర్లో 17 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మెగాక్యాంప్సను ఏర్పాటు చేయనున్నారు. దీనిద్వారా దాదాపు 10 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. క్వాల్కామ్.. అమెరికా సహా భారత్, ఇజ్రాయిల్, సింగపూర్, చైనా, పశ్చిమ యూర్పల్లోని వివిధ ప్రాంతాల్లో 167 కార్యాలయాలతో పాటు ఆర్ అండ్ డి సెంటర్లను నిర్వహిస్తోంది.