యాప్నగరం

నోబెల్ రేసులో రఘురామ్ రాజన్

2017కు గానూ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని అక్టోబరు 9 ప్రకటించనున్నారు. నోబెల్ తుది జాబితాలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘరామ్ రాజన్ ఉన్నారు.

TNN 7 Oct 2017, 10:28 pm
ఈ ఏడాది అర్థ శాస్త్రంలో నోబెల్ బహుమతి తుది రేసులో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఉన్నారు. తుది జాబితాలో ఉన్న ఆరుగురి ఆర్థికవేత్తల్లో రాజన్ పేరు కూడా ఉన్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక వెల్లడించింది. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన వందలాది మంది ఆర్థిక వేత్తల పేర్లను పరిశీలించిన నోబెల్ కమిటీ అనేక దశల తర్వాత ఆరుగురి సభ్యులను ఎంపిక చేసింది. విజేతను అక్టోబరు 9 న ప్రకటించనుంది. ఆర్బీఐ గవర్నర్‌గా మూడేళ్లు పనిచేసిన రాజన్ గతేడాది సెప్టెంబరు 4న పదవి నుంచి తప్పుకున్నారు.
Samayam Telugu raghuram rajan among probables for nobel prize for economics
నోబెల్ రేసులో రఘురామ్ రాజన్


కార్పొరేట్ ఫైనాన్స్ విభాగంలో రఘురామ్ రాజన్ పరిశోధనలు ప్రశంసనీయమని క్లార్వియేట్ ఎనలిటిక్స్ పేర్కొంది. అయితే తుది జాబితాలో రాజన్‌కు చోటుదక్కినా నోబెల్ బహుమతి వచ్చే అవకాశాలు తక్కువని అభిప్రాయపడింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ ఆర్థికవేత్తగా 40 ఏళ్ల వయసులో నియమించబడ్డ తొలి పాశ్చాత్యేతర దేశస్థుడు రాజన్ కావడం విశేషం. 2005లో అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ఆయన ముందుగానే అంచనా వేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రఘురామ్ రాజన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పదవీవిరమణ తర్వాత చికాగో వర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా చేరారు.


నోబెల్ పోటీదార్ల జాబితాలో ఉన్నవారిలో కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన కొలిన్ కెమరర్, కార్నేగ్ మిలాన్ యూనివర్సిటీ జార్జ్ ల్యూవెనెస్టీన్‌లు బిహేవిరియల్ ఎకనమిక్స్, న్యూరోఎకనమిక్స్‌పై విశేష పరిశోధనలు చేశారు. స్టాన్‌ఫార్డ్ యూనివర్సిటీకి చెందిన రాబర్ట్ హాల్ నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం, కార్మికుల ఉత్పాదకతపై పరిశోధనలు చేస్తే, హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన మిచెల్ జెన్సెన్, మిట్ వర్సిటీకి చెందిన స్టీవార్ట్ మెయిర్స్, చికాగో యూనివర్సిటీకి చెందిన రఘురామ్ రాజ‌న్‌లు కార్పొరేట్ ఫైనాన్స్‌పై పరిశోధనలు చేసినట్లు తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.