ఆర్బీఐ గవర్నర్గా రెండో దఫా బాధ్యతలు చేపట్టేందుకు రఘురామ రాజన్ విముఖతను వ్యక్తం చేశారు. మళ్లీ తనకు ఇష్టమైన అధ్యాపక వృత్తిలోకి ఆయన వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్రెంటల్ బ్యాంక్ స్టాఫ్కు రాసిన లేఖ ద్వారా రాజన్ తెలియజేశారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా రఘురామ్ పదవీ కాలం సెప్టెంబర్ 4తో ముగియనుంది. అంతకు ముందు చికాగో వర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిన ఆయన సెలవు మీద వచ్చి ఆర్బీఐ గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టాక రాజన్ చాలా సవాళ్లను ఎదుర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి, రూపాయి విలువ పతనం కాకుండా అడ్డుకోవడానికి అనేక చర్యలు తీసుకున్నారు. బ్యాంకింగ్ రంగ పనితీరు మెరుగుపర్చడం కోసం పలు సంస్కరణలు చేపట్టారు. ఆయన కృషి వల్ల అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందింది. అయితే భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికే ఆర్బీఐ గవర్నర్గా రాజన్ బాధ్యతలు చేపట్టారని, ఆయన్ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రధానికి లేఖ రాశారు. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన రాజన్ మరోసారి పదవిని చేపట్టొద్దనే నిర్ణయానికి వచ్చి ఉంటాడని భావిస్తున్నారు.
మరో దఫాకు రాజన్ నో!
ఆర్బీఐ గవర్నర్గా రెండో దఫా బాధ్యతలు చేపట్టేందుకు రఘురామ రాజన్ సుముఖంగా లేరు..
TNN 18 Jun 2016, 6:33 pm