యాప్నగరం

ఆర్‌బీఐ గుడ్ న్యూస్.. ఇకపై కార్డ్స్, వాలెట్లను మర్చిపోవచ్చు..!

టెక్నాలజీ పుణ్యమా అని బ్యాంకింగ్ సేవలు చాలా సులభతరమయ్యాయి. ఇప్పుడు బ్యాంక్‌కు వెళ్లకుండానే ఎన్నో రకాల సేవలు పొందగలుగుతున్నాం. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత లావాదేవీలు ఈజీ అయిపోయాయి. యూపీఐ ప్లాట్‌ఫామ్‌కు మంచి ఆదరణ లభించింది.

Samayam Telugu 13 Jan 2020, 9:48 am
టెక్నాలజీ పుణ్యమా అని బ్యాంకింగ్ సేవలు చాలా సులభతరమయ్యాయి. ఇప్పుడు బ్యాంక్‌కు వెళ్లకుండానే ఎన్నో రకాల సేవలు పొందగలుగుతున్నాం. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత లావాదేవీలు ఈజీ అయిపోయాయి. యూపీఐ ప్లాట్‌ఫామ్‌కు మంచి ఆదరణ లభించింది.
Samayam Telugu rbi allows sip payments through unified payments interface system
ఆర్‌బీఐ గుడ్ న్యూస్.. ఇకపై కార్డ్స్, వాలెట్లను మర్చిపోవచ్చు..!


ఇప్పుడు కొత్త పెసిలిటీ

యూపీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇప్పటి దాకా మనీ ట్రాన్స్‌ఫర్, మనీ రిసీవ్, బిల్లు చెల్లింపు, రీచార్జ్ వంటి పలు సేవలు పొందుతూ వచ్చాం. కానీ రికరింగ్ పేమెంట్ ఆప్షన్ మాత్రం అందుబాటులో ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఈ ఫెసిలిటీ కూడా అందుబాటులోకి వచ్చేసింది. కస్టమర్లు ఇకపై యూపీఐ ద్వారా మ్యూచువల్ ఫండ్ సిప్ నిర్వహించొచ్చు. ఇన్సూరెన్స్ పేమెంట్లను చెల్లించొచ్చు. రికరింగ్ పేమెంట్ ఫెసిలిటీ ఇంతవరకు కార్డ్స్, వాలెట్లకు మాత్రమే అందుబాటులో ఉండేది.

Also Read: షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి ఝలక్!

ఆర్‌బీఐ నిర్ణయం

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం రోజులన ఈ నిర్ణయం తీసుకుంది. యూపీఐ సిస్టమ్ ద్వారా రికరింగ్ ట్రాన్సాక్షన్లపై ఇమాండేట్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఇకపై యూపీఐ యూజర్లు నేరుగా సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా ఇతర రికరింగ్ పేమెంట్లను సెట్ చేసుకోవచ్చు.

Also Read: ఆ ఏటీఎంలో రూ.100కు బదులు రూ.500 నోట్లు.. క్యూ కట్టిన జనం!

గతేడాదిలోనే సేవలు లాంచ్

ఆర్‌బీఐ గతేడాది ఆగస్ట్ నెలలోనే రికరింగ్ పేమెంట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అప్పుడు కార్డ్స్ ద్వారా జరిపే రికరింగ్ ట్రాన్సాక్షన్లకు మాత్రమే ఇ-మాండేట్‌ను వర్తింపజేసింది. కార్డ్స్‌పై ఇ-మాండేట్ సర్వీస్ కేవలం రికరింగ్ ట్రాన్సాక్షన్లకు మాత్రమే వర్తిస్తుందని, వన్స్ ఓన్లీ పేమెంట్‌కు వర్తించదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Also Read: 5 క్రెడిట్ కార్డ్ టిప్స్.. ఫాలో అయితే మీ క్రెడిట్ స్కోర్ పైపైకి!

వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి

కార్డులపై ఇ-మాండేట్ సర్వీసులు పొందాలని భావిస్తే.. కస్టమర్ల ముందుగా వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. ఏఎఫ్‌ఏ (అడిషనల్ ఫ్యాక్టర్ అథంటికేషన్) వాలిడేషన్ ఉంటేనే ఇ-మాండేట్ సర్వీసులు పొందొచ్చని పేర్కొంది. ఇప్పుడు ఇమాండేట్ సర్వీసులు యూపీఐ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి.

Also Read: సుకన్య సమృద్ధి అకౌంట్‌తో ఎన్నో లాభాలు.. తెలుసుకోవాల్సిన 10 అంశాలివే!

ట్రాన్సాక్షన్ లిమిట్

ఆర్‌బీఐ ప్రకారం.. ఇమాండేట్ రికరింగ్ ట్రాన్సాక్షన్లకు పరిమితి ఉంటుంది. రూ.2,000 వరకు ట్రాన్సాక్షన్‌ను మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే ఏఎఫ్ఏ అథంటికేషన్ ఉండదు. అదే రూ.2,000 పరిమితిని దాటితే మాత్రం ఏఎఫ్ఏ ప్రక్రియ ఉంటుంది. ఇకపోతే ఇమాండేట్‌కు ఎలాంటి చార్జీలు ఉండవు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.