యాప్నగరం

ఆర్‌బీఐ గవర్నర్ ఎమర్జెన్సీ మీటింగ్.. వడ్డీ రేట్లపై కీలక ప్రకటన

అమెరికా ఫెడరల్ రిజర్వు ప్రకటనకు ముందే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వడ్డీ రేట్లపై కీలక ప్రకటన చేసింది. బుధవారం మధ్యాహ్నం ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటన చేశారు. కీలక వడ్డీ రేటు రెపోను 40 బేసిస్ పాయింట్లు పెంచేశారు. ఈ దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా పతనమైంది.

Authored byKoteru Sravani | Samayam Telugu 4 May 2022, 2:42 pm

ప్రధానాంశాలు:

  • వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం..
  • రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు పెంపు
  • 4.40 శాతానికి చేరుకున్న రెపో రేటు
  • వడ్డీ రేట్ల పెంపుకు ఏకగ్రీవంగా ఆమోదం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu RBI Governor
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన చేశారు. బుధవారం మధ్యాహ్నం ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించిన శక్తికాంత్ దాస్ కీలక వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించారు. వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచేందుకు మానిటరీ పాలసీ కమిటీలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు శక్తికాంత్ దాస్ తెలిపారు. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచేందుకు ఎంపీసీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని, తక్షణమే ఈ వడ్డీ రేటు అమల్లోకి వస్తుందని శక్తికాంత్ దాస్ ప్రకటించారు. దీంతో రెపో రేటు 4.40 శాతానికి చేరుకుంది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు ప్రస్తుతం 4.15 శాతం వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటు 4.65 శాతం వద్ద ఉన్నాయి.
దేశీయంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు భారీగా పెరగడంతో.. ఆర్‌బీఐ ఈ చర్యలు తీసుకుంది. రెండేళ్ల తర్వాత ఆర్‌బీఐ రెపో రేటును పెంచింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచడంతో.. దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. వెయ్యి పాయింట్లకు పైగా సెన్సెక్స్ కుదేలైంది. ఈ దెబ్బకు బ్యాంకు రుణాల వడ్డీ రేట్లు కూడా భారీగా పెరగనున్నాయి. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వు కూడా నేడు వడ్డీ రేట్లపై ప్రకటన చేయబోతుంది. ఇప్పటికే ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచనున్నట్టు సంకేతాలు ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ద్రవ్యోల్బణ భయాలతోనే సెంట్రల్ బ్యాంకులు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ఆర్‌బీఐ ఏప్రిల్‌లో నిర్వహించిన సమావేశంలో బెంచ్ మార్క్ లెండింగ్ రేటును మార్చలేదు. ఆ సమయంలో 4 శాతంగానే ఈ వడ్డీ రేటును ఉంచింది. దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్టానికి ఎగిసింది. ఫుడ్, తయారీ గూడ్స్ ధరలు పెరగడంతో.. మార్చి నెలలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలకు పెరిగినట్టు అధికారిక డేటాలో వెల్లడైంది.

Also read : టాటా గ్రూప్ మరో కీలక నిర్ణయం.. మూత పడిన ప్రభుత్వ సంస్థ కొనుగోలు

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.