యాప్నగరం

RBI Imposes Penalty: మరో సహకార బ్యాంక్‌పై RBI కొరడా.. SBI కంటే ఎక్కువ వడ్డీ ఇస్తుందనే కారణంతో..!

RBI Imposes Penalty: ఇటీవలి కాలంలో సహకార బ్యాంకులపై కేంద్ర బ్యాంక్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొరడా ఝులిపిస్తోంది. ఇప్పుడు మరో బ్యాంక్‌కు పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. నిబంధనలు ఉల్లంఘించడమే కారణమని చెప్పుకొచ్చింది.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 6 Mar 2023, 4:37 pm
RBI Imposes Penalty: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ది నాకోదర్ హిందూ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. ఏకంగా రూ.3 లక్షలు ఫైన్ వేసింది. ఈ మేరకు మార్చి 6న స్పష్టం చేసింది RBI. ఇది బ్యాంక్ రెగ్యులేటరీ నిబంధనలో లోపాల కారణంగా విధించబడిందని, ఇది కస్టమర్లకు నేరుగా లావాదేవీలు, అగ్రిమెంట్లకు సంబంధించినది కాదని పేర్కొంది. 2021, జులై 26న ఈ బ్యాంక్ విడుదల చేసిన సూపర్‌వైజరీ యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ (SAF) రివ్యూ రిపోర్ట్ ప్రకారం.. ఈ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. అసలు కారణం ఏంటంటే.. దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ కాలవ్యవధుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆఫర్ చేసిన దాని కంటే ఎక్కువగా ఈ బ్యాంక్ వడ్డీ రేట్లు అందించిందంట.
Samayam Telugu RBI Penalty


ఇదే విషయమై ఆ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటీసులు అందజేసింది. తమ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేటతెల్లం అవుతుందని, తమపై ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలంటూ స్పష్టం చేసింది. ఇక దీనిపై బ్యాంకు కూడా రిప్లై ఇచ్చింది. దానికి సంతృప్తి చెందని కేంద్ర బ్యాంక్.. ఇక ఆ బ్యాంక్‌కు రూ.3 లక్షల మేర ఫైన్ వేసింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదని హెచ్చరించింది.

ఇక ఇటీవలి కాలంలో బ్యాంకు మోసాలు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి వారు బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారు. ఇదే నేపథ్యంలో చాలా బ్యాంకుల్లో మొండిబకాయిలు పేరుకుపోయిన విషయం రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చింది. చాలా బ్యాంకులు దివాలా తీసే స్థితిలో ఉన్నాయట. ఇదే క్రమంలో ఇలాంటి పలు బ్యాంకుల ట్రాన్సాక్షన్లపై RBI ఆంక్షలు విధిస్తూ వస్తోంది.

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.