యాప్నగరం

పేటీఎంకు ఆర్‌బీఐ భారీ షాక్.. కీలక నిర్ణయం!

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు ఆర్‌బీఐ గట్టి ఝలక్ ఇచ్చింది. ఏకంగా రూ.కోటి జరిమానా విధించింది. బ్యాంక్ నిబంధనలను అతిక్రమించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Samayam Telugu 21 Oct 2021, 8:36 am

ప్రధానాంశాలు:

  • పేటీఎంకు ఆర్‌బీఐ ఝలక్
  • భారీ జరిమానా
  • కారణం ఇదే

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu paytm
ఇటీవల దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIకు ఝలక్ ఇచ్చిన దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఇప్పుడు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు షాకిచ్చింది. భారీ జరిమానా విధించింది. పలు నిబంధనల అతిక్రమణ నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఆర్‌బీఐ తాజాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రూ.కోటి జరిమానా విధించింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 నిబంధనల అతిక్రమణ నేపథ్యంలో జరిమానా విధించామని ఆర్‌బీఐ వివరణ ఇచ్చింది. అంతేకాకుండా మరో సంస్థకు కూడా ఆర్‌బీఐ పెనాల్టీ విధించింది.
వెస్ట్రన్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థకు రూ.27.8 లక్షల జరిమానా వేసింది. రెమిటెన్స్ లిమిట్ అతిక్రమణ నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ మేరకు పెనాల్టీ విధించింది. కాగా ఆర్‌బీఐ ఇటీవలనే ఎస్‌బీఐకి రూ.కోటి, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌కు రూ.1.9 కోట్ల మేర జరిమానా వేసింది.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.