యాప్నగరం

ఎల్‌వోయూల‌ను ఆపేసిన ఆర్బీఐ

పీఎన్బీ కుంభకోణం అసలుకే ఎసరు తెచ్చింది. వాణిజ్య, పారిశ్రామిక రంగాలు విరివిగా వినియోగించుకునే బ్యాంకు గ్యారంటీ సాధనాలు లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌, లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌ను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) రద్దు చేసింది. ఇకపై ఈ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను జారీ చేయవద్దని బ్యాంకులను ఆదేశించింది

TNN & Agencies 14 Mar 2018, 2:39 pm
పీఎన్బీ కుంభకోణం అసలుకే ఎసరు తెచ్చింది. వాణిజ్య, పారిశ్రామిక రంగాలు విరివిగా వినియోగించుకునే బ్యాంకు గ్యారంటీ సాధనాలు లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌, లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌ను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) రద్దు చేసింది. ఇకపై ఈ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను జారీ చేయవద్దని బ్యాంకులను ఆదేశిం చింది. లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌ (ఎల్‌ఒయు)ను ఉపయోగించే వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్బీ)ను 13,000 కోట్ల రూపాయల మేర మోసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో వాణిజ్య వర్గాలు బ్యాంకుల సర్వీసుల్లో భాగంగా ఉపయోగించుకుంటున్న బ్యాంకు గ్యారంటీలు, లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ సౌకర్యాలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయి.
Samayam Telugu rbi scraps bank lous in the aftermath of pnb fraud
ఎల్‌వోయూల‌ను ఆపేసిన ఆర్బీఐ



సాధారణంగా ఎల్‌ఒయుల్లో వ్యాపార సంస్థ మోసానికి పాల్పడితే జారీ చేసిన బ్యాంకు నెత్తిన భారం పడుతుంది. నీరవ్‌ మోదీ విషయంలో మొత్తం నష్టాన్ని పీఎన్బీ భరిస్తున్న విషయం తెలిసిందే. బ్యాంకు గ్యారంటీలు, ఎల్‌ఒసిల విషయంలో కస్టమర్‌ ఆర్థిక పరిస్థితిని బ్యాంకులు ముందుగానే మదింపు వేయడంతో పాటు నష్టం జరగకుండా పూచీలను పకడ్బందీగా తీసుకుంటాయి. ఎల్‌ఒసిలపై దిగుమతుల పూర్తి వివరాలు, జారీ చేసిన తేదీ, ఎక్స్‌పైరీ డేట్‌, ఇతర లావాదేవీల వివరాలు ఉంటాయి. లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ సౌకర్యాన్ని వినియోగించుకున్న సంస్థలు బ్యాంకులకు టోపీ వేయడం దాదాపు అసాధ్యం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.