యాప్నగరం

PM CARES Fund: రిలయన్స్ ఇండస్ట్రీస్ విరాళం రూ.500 కోట్లు

Mukesh Amabani | కరోనాపై పోరాటం కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.500 కోట్ల విరాళం ప్రకటించింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు అదనంగా రూ. 5 కోట్ల చొప్పున సాయం చేస్తున్నట్లు తెలిపింది.

Samayam Telugu 30 Mar 2020, 8:08 pm
కరోనాపై పోరాటం కోసం పీఎం కేర్స్ ఫండ్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.500 కోట్ల విరాళం ప్రకటించింది. దీంతోపాటు అదనంగా మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలకు రూ.5 కోట్ల చొప్పున సాయం అందించినట్లు రిలయన్స్ తెలిపింది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం ముంబైలో ప్రత్యేకంగా కోవిడ్-19 హాస్పిటల్‌ను రిలయన్స్ ఏర్పాటు చేస్తుందని ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ఇప్పటికే ప్రకటించారు. కరోనా చికిత్స కోసమే దేశంలో నిర్మించే తొలి హాస్పిటల్ ఇదన్నారు. అన్ని బెడ్లకు వెంటిలేటర్లు, పేస్‌మేకర్లు, డయాలసిస్ మెషిన్లు, పేషెంట్ మానిటరింగ్ పరికరాలను ఏర్పాటు చేస్తామని రిలయన్స్ ప్రకటించింది.
Samayam Telugu mukesh


అంతకు ముందే కరోనాపై పోరాటం కోసం టాటా ట్రస్టుల తరఫున పీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ.500 కోట్లు కేటాయిస్తున్న రతన్ టాటా తెలిపారు. టాటా సన్స్ మరో వెయ్యి కోట్ల రూపాయల్ని సాయంగా ప్రకటించింది. దీంతో కోవిడ్ కట్టడి కోసం టాటా సంస్థలు రూ.1500 కోట్లు విరాళంగా ఇచ్చినట్లయ్యింది.

కోవిడ్ మహమ్మారిపై పోరాటం కోసం లాక్‌డౌన్ విధించిన ప్రధాని మోదీ.. వైద్య పరికరాల కొనుగోలు, ఇతర సాయం కోసం ప్రజలు విరాళాలు ఇవ్వాలని కోరారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు విరాళాలు ఇవ్వడం కోసం పీఎం కేర్స్ ఫండ్‌ను ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.