యాప్నగరం

Reliance Q3 Results: రిలయన్స్ ఫలితాలొచ్చాయ్.. అంబానీ వారసుల్లో ఎవరు టాప్? రిపోర్ట్ కార్డ్ ఇదే..

Reliance Q3 Results: భారత దిగ్గజ పారిశ్రామిక వేత్త, కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. తన బిజినెస్‌లో తన వారసులకు వేర్వేరు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. వీరు చక్కగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు కూడా. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో త్రైమాసిక ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ వ్యాపారం ఎలా ఉంది? అంబానీ వారసుల్లో ఎవరు చూసే బిజినెస్ ఎక్కువ లాభదాయకంగా మారింది చూద్దాం.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 21 Jan 2023, 3:35 pm
Reliance Q3 Results: మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ దీనికి అధినేత. ఈ కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్- డిసెంబర్) ఫలితాలను తాజాగా విడుదల చేసింది. నికర లాభం రూ. 15,792 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే ఈ నికర లాభం 15 శాతం తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 18,549 కోట్ల నికర లాభం ప్రకటించింది. అయితే రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో క్వార్టర్‌లో నికర లాభం 15.6 శాతం మేర పెరిగింది. జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం రూ.13,656 కోట్లుగా ఉంది. లాభం కాస్త తగ్గినా.. ఆదాయం పరంగా మాత్రం దుమ్మురేపింది. ఏకంగా 15 శాతం పెరిగి.. రూ.2.4 లక్షల కోట్లుగా నమోదు చేసింది.
Samayam Telugu Reliance Results


అయితే ముకేశ్ అంబానీ తన వ్యాపారాల్లోకి ఎప్పుడో తన వారసులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ముగ్గురికీ తలో వ్యాపార బాధ్యతలను అప్పజెప్పారు. పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి రిలయన్స్ టెలికాం (జియో) బాధ్యతలు అప్పగించగా.. కుమార్తె ఇషా అంబానీకి రిలయన్స్ రిటైల్ బాధ్యతలు ముట్టజెప్పారు. ఇక చిన్న కుమారుడు అనంత్ అంబానీకి మాత్రం.. ఆయిల్ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ బిజినెస్ కేటాయించారు. గ్రీన్ ఎనర్జీ బాధ్యతలను స్వయంగా ముకేశ్ అంబానీనే చూస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఆ లాభాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.

అన్ని రికార్డులు బద్దలు కొట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. భారత్‌లోనే బెస్ట్.. ఈ ఫీచర్లు తెలిస్తే..

Akash Ambani-Telecom

ఆకాశ్ అంబానీ చూస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం బిజినెస్ రిలయన్స్ జియో ఆదాయం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.29,195 కోట్లుగా నమోదైంది. ఇప్పటివరకు ఇదే రికార్డు. ఇదే సమయంలో కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ రూ.12,519 కోట్లుగా ఉంది. ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం 28.6 శాతం పెరిగి రూ.4881 కోట్లకు చేరింది. ఒక్కో యూజర్‌పై జియోకు సగటు ఆదాయం రూ.178.2 గా ఉంది. గత త్రైమాసికంతో పోలిస్తే జియో కస్టమర్లు పెరిగారు. డిసెంబర్ 31 నాటికి జియోకు 43.29 కోట్ల కస్టమర్లు ఉన్నారు.

ఇల్లు కొనేందుకు ఇదే మంచి సమయమా? హైదరాబాద్‌లో మంచి డిమాండ్ ఎక్కడో తెలుసా?

Reliance Retail- Isha Ambani

అంబానీ కుమార్తె ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ బిజినెస్ కూడా మూడో త్రైమాసికంలో మంచి లాభాలనే ఆర్జించింది. ఆపరేటింగ్ రెవెన్యూ 17 శాతం మేర పెరిగి రూ.67,634 కోట్లుగా నమోదైంది. నికర లాభం కూడా 6.2 శాతం పెరిగి రూ.2400 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్‌లో నికర లాభం మాత్రం రూ.2,259 కోట్లుగా ఉంది.

డబ్బు విషయంలో మీరు ఈ 6 తప్పులు చేస్తున్నారా? కొత్త ఏడాదిలో జాగ్రత్త..!

O2C-Anant Ambani

ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ రిఫైనింగ్, పెట్రో కెమికల్స్ బాధ్యతలను చిన్న కుమారుడు అనంత్ అంబానీ చూస్తున్న సంగతి తెలిసిందే. సంవత్సర కాలంగా చూస్తే గనుక ఈ బిజినెస్ ఆదాయంలో 10 శాతం వృద్ధి కనిపించింది. ఈ రెవెన్యూ ఏకంగా 1.44 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ సెగ్మెంట్‌లో ఎగుమతులు కూడా 21 శాతం పెరిగి విలువ రూ.78,331 కోట్లకు చేరింది. ఇది మొత్తం కంపెనీ ఆదాయంలో 54 శాతం.


Also Read: లక్ష ఇన్వెస్ట్‌మెంట్‌ను రూ.82 కోట్లు చేసిన స్టాక్.. ఓపిక ముఖ్యం.. మీ దగ్గరుందా?

ఐటీ ఉద్యోగులకు చేదువార్త.. వందల మంది ఫ్రెషర్స్‌ను పీకేసిన విప్రో.. అలా చేస్తే మీకూ కష్టమే!
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.